Uttar Pradesh : ప్రియుడితో పెళ్లి వద్దన్నందుకు ఆ కూతురు ఏమి చేసిందంటే….

ప్రియుడి మోజులో పడి కన్నతండ్రినే కాటికి పంపిందో యువతి. ప్రేమించిన వాడితో పెళ్లి చేసేందుకు ఒప్పుకోలేదని ప్రియుడితో కలిసి తండ్రిని హత్యచేసి పరారయ్యింది. ఉత్తర్ ప్రదేశ్‌లోని సంభల్ జిల్లాలో ఈ దారుణం చోటు చేసుకుంది.

Uttar Pradesh : ప్రియుడితో పెళ్లి వద్దన్నందుకు ఆ కూతురు ఏమి చేసిందంటే….

Arrested

Uttar Pradesh : ప్రియుడి మోజులో పడి కన్నతండ్రినే కాటికి పంపిందో యువతి. ప్రేమించిన వాడితో పెళ్లి చేసేందుకు ఒప్పుకోలేదని ప్రియుడితో కలిసి తండ్రిని హత్యచేసి పరారయ్యింది. ఉత్తర్ ప్రదేశ్‌లోని సంభల్ జిల్లాలో ఈ దారుణం చోటు చేసుకుంది.

సంభల్ జిల్లా ముబైన్ గ్రామమానికి చెందిన హర్పాల్‌సింగ్‌కు ఒక్కగానొక్క కుమార్తె ప్రీతి. ఆమె బడాన్‌లోని పాటిసే‌లో నివసించే ధర్మేంద్ర అనే వ్యక్తి ప్రేమలో పడింది. హర్పాల్‌సింగ్ ప్రీతిని ఒక్కగానొక్క కూతురు కదా అని అల్లారుముద్దుగా పెంచుకుంటున్నాడు. ఈ నేపధ్యంలో ధర్మేంద్రను ప్రేమిస్తున్నానని…. అతనితో తన వివాహం జరిపించాలని ప్రీతి తండ్రిని కోరింది. అందుకు హర్పాల్‌సింగ్ నిరాకరించాడు.ఈవిషయం ధర్మేంద్రకు చెప్పింది. దీంతో ఇద్దరూ కలిసి హర్పాల్‌సింగ్‌ను హత్య చేసేందుకు పధకం రచించారు.

జులై 19న హర్పాల్ సింగ్ పొలానికి వెళ్లాడు. ఆ తర్వాత ఎంతసేపటికి ఇంటికి తిరిగి రాలేదు. పొలంలోనే ఒక చెట్టుకు హర్పాల్ సింగ్ మృతదేహాం వేలాడుతూ కనిపించింది. ఆయనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుని ఉంటాడని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. కానీ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆత్మహత్య కేసు నమోదుచేసి మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపారు.

పోస్టుమార్టంలో తలపై ఇనుప రాడ్ తో బలంగా కొట్టటం వల్లే మరణించినట్లు తేలింది. దీనితో హత్య కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు కేసు విచారించటానికి వస్తున్నారని తెలిసి హర్పాల్‌సింగ్ కుమార్తె పరారయ్యింది. గాలింపు చేపట్టిన పోలీసులు నిందితులిద్దరినీ బదౌన్‌ జిల్లా ఇస్లాంనగర్ లో అరెస్ట్ చేశారు.

జులై 19 న హర్పాల్ సింగ్ పొలానికి వెళ్లగానే ప్రీతి ఈ విషయాన్నితన ప్రియుడు ధర్మేంద్రకు చెప్పింది. ఇద్దరూ కల్సి పొలం దగ్గరకు వెళ్లారు. పొలం పని చేసుకుంటున్న తండ్రిని ఇనుప‌రాడ్‌తో ప్రీతి బలంగా కొట్టింది. ఆదెబ్బకు తండ్రి అక్కడికక్కడే కన్నుమూశాడు. ప్రియుడు ధర్మేంద్రతో కలిసి తండ్రి శవాన్ని దగ్గరలోని చెట్టు వద్దకు తీసుకువెళ్లి ఉరి వేసి ఇద్దరూ ఇంటికి తిరిగి వచ్చారు. ఆత్మహత్య కింద కేసు నమోదు చేసిన పోలీసులు పోస్టుమార్టంకి పంపి… హత్య విషయం బయటకు రావటంతో ప్రేయసి ప్రియులిద్దరూ పరారయ్యారు.