కలకలం : నాగ్ పూర్ మేయర్‌పై కాల్పులు 

  • Published By: madhu ,Published On : December 18, 2019 / 04:10 AM IST
కలకలం : నాగ్ పూర్ మేయర్‌పై కాల్పులు 

నాగ్ పూర్ మేయర్‌ సందీష్ జోషిపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరపడం కలకలం సృష్టించింది. 2019, డిసెంబర్ 17వ తేదీ మంగళవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. కాల్పుల్లో ఆయన తృటిలో తప్పించుకున్నారు. ఆయనతో పాటు అనుచరుడు ఆదిత్య ఠాకూర్ ప్రాణాలతో బయటపడ్డారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. వార్ధా రోడ్డు వద్ద చోటు చేసుకున్న ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. 

వివరాల్లోకి వెళితే : –
సందీష్ జోషి…24వ పెళ్లి రోజు..ఈ సందర్భంగా కొంతమంది స్నేహితులతో కలిసి నాగ్ పూర్ ఔటర్ రింగ్ రోడ్డు వద్దనున్న ఓ దాభాలో విందు జరుపుకున్నారు. అనంతరం సందీష్ జోషి..స్వయంగా తన కారు నడుపుకుంటూ ఇంటికి బయలుదేరారు. వార్థా రోడ్డు జంక్షన్ వద్దకు చేరుకోగానే..బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు కారును అడ్డగించారు. అనంతరం ఫైరింగ్ ఓపెన్ చేశారు. అనంతరం వెంటనే వారు పరారయ్యారు. ఓ బుల్లెట్ మేయర్ కూర్చొన్న డ్రైవింగ్ సీటు అద్దాలకు, మరో బుల్లెట్ వెనుక సీటు విండోకు, ఇంకో బుల్లెట్ వాహనం వెనుక వైపు తగిలింది. 

Read More : PPF నిబంధనల సవరింపు

వెంటనే జోషి..కాల్పుల విషయాన్ని పోలీసులకు తెలియచేశారు. ఘటనా ప్రదేశానికి పోలీసులు చేరుకున్నారు. ధాబా నుంచి బయలుదేరినప్పటి నుంచి కారును నిందితులు అనుసరించారని, అనువైన సమయం చూసి కాల్పులు జరిపినట్లు అడిషనల్ సీపీ నీలేష్ వెల్లడించారు. ఆక్రమణలు తొలగించడంపై జోషిని బెదిరిస్తూ..NMC కంప్లైట్ బాక్స్‌లో రెండు లేఖలు వచ్చాయి. 

Nagpur Mayor, Sandip Joshi: I was out with my family. While I was returning two people came in a vehicle and fired bullets on my vehicle, thrice. I had received threats earlier. Police says this might be in connection with encroachment in the city. https://t.co/rLzxyF6GgE pic.twitter.com/LUYbG35tZS