ఇద్దరు హోటల్ ఉద్యోగినులపై అత్యాచారం-ఐదుగురు అరెస్ట్

ఇద్దరు హోటల్ ఉద్యోగినులపై అత్యాచారం-ఐదుగురు అరెస్ట్

Five men gang rape 2 hotel workers : రాజస్ధాన్ లోని ఒక త్రీస్టార్ హోటల్ లో పని చేసే మహిళా ఉద్యోగినులపై అత్యాచారం చేసిన ఐదుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. రాజస్ధాన్ లోని నీమ్రాన్ లోని ఓ త్రీ స్టార్ హోటల్లోకి శుక్రవారం ఇద్దరు వ్యక్తులు తుపాకులతో ప్రవేశించారు. తమకు సెక్స్ వర్కర్లను ఏర్పాటు చేయాలని మేనేజర్ ను కోరారు. అడిగిన వెంటనే సెక్స్ వర్కర్లను ఏర్పాటు చేయకపోవటంతో, వారు హోటల్ లో మహిళా సిబ్బంది ఉండే గదిలోకి ప్రవేశించి తుపాకితో బెదిరించి ఇద్దరు మహిళలపై అత్యాచారం చేశారు.

ఈ క్రమంలో మరో ముగ్గురు దుండగులు వచ్చి వారితో కలిశారు. ఇంతలో హోటల్ మేనేజర్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు అత్యాచారానికి గురైన మహిళలను ఆస్పత్రికి తరలించారు. అత్యాచారానికి పాల్పడిన ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రివాల్వర్లు, బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు.

వారిని విచారించగా విస్తుపోయే విషయాలు బయట పడ్డాయి. ఒక వ్యాపార వేత్తను బెదిరించి అతని వద్దనుంచి డబ్బు రాబట్టే యోచనలో ఉన్నట్లు….ఒక వేళ డబ్బు చెల్లించకపోతే అతడ్ని హత్య చేయటానికి కూడా సిధ్ధమైనట్లు తెలుసుకుని షాకయ్యారు. నిందితులపై  కేసు నమోదు చేసి పోలీసులు విచారణ చేపట్టారు.