Road Accident Five Died : బాపట్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఎస్ఐ భార్యాకూతురు సహా ఐదుగురు మృతి

ఆంధ్రప్రదేశ్ లోని బాపట్ల జిల్లాలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. కొరిశపాడు మండలం మేదరమెట్ల బైపాస్ లో జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

Road Accident Five Died : బాపట్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఎస్ఐ భార్యాకూతురు సహా ఐదుగురు మృతి

accident

Road Accident Five Died : ఆంధ్రప్రదేశ్ లోని బాపట్ల జిల్లాలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. కొరిశపాడు మండలం మేదరమెట్ల బైపాస్ లో జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. చినగంజాం నుంచి అద్దంకి వెళ్తోన్న కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టింది. కారు రోడ్డు అవతలికి పడిపోవడంతో ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో నలుగురు మహిళలు ఉన్నారు.

ఈ ప్రమాదంలో డ్రైవర్ కూడా చనిపోయారు. మృతుల్లో అద్దంకి పోలీస్ స్టేషన్ లో ఎస్ ఐగా విధులు నిర్వహిస్తున్న సుందర్ వలీ కుటుంబ సభ్యులు కూడా ఉన్నట్లు గుర్తించారు. మృతులు అయేషా, గుర్రాల జయశ్రీ, గుర్రాల దివ్య, కొండమీది వీరబ్రహ్మచారిగా గుర్తించారు. గుంటూరులో ఉంటున్న ఎస్ఐ సుందర్ వలీ కుటుంబ సభ్యులు చినగంజాంలో జరుగుతున్న శివరాత్రి తిరునాళ్ల మహోత్సవాలను చూసేందుకు వచ్చారు.

Newlywed Couple Died : రోడ్డు ప్రమాదంలో నవ దంపతులు మృతి.. రెండు రోజుల క్రితం సింహాచలం దేవస్థానంలో వివాహం

చినగంజాంలో ఉత్సవాలు ముగించుకున్న అనంతరం వారు అర్ధరాత్రి కారులో అద్దంకిలో ఉంటున్న ఎస్ఐ సుందర్ వలీ నివాసానికి బయల్దేరారు.  అక్కడ కొద్ది సేపు విశ్రాంతి తీసుకుని అక్కడి నుంచి గుంటూరుకు వెళ్దామనుకున్నారు. ఈ క్రమంలో అద్దంకికి వస్తున్న క్రమంలో మార్గంమధ్యంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎస్ ఐ సుందర్ వలీ భార్య, కూతురుతోపాటు గుంటూరులో నివాసముంటున్న ఆయన భార్య కుటుంబం నివాసానికి ఇరుగు పొరుగున ఉన్న ఇద్దరు మహిళలు, డ్రైవర్ కలిపి మొత్తం ఐదుగురు మృతి చెందారు.

సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం అద్దంకి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టారు.