మద్యంమత్తులో కానిస్టేబుల్ సహా ఐదుగురు హల్ చల్ : మీడియా ప్రతినిధిపై దాడి
నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రిలో ఐదుగురు వ్యక్తులు మద్యంమత్తులో హల్ చల్ చేశారు. ఓ న్యూస్ కవరేజ్ కోసం వెళ్లిన మీడియా సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. ‘కేసీఆర్ మా అండ ఉన్నడు… కేసీఆర్ జిందాబాద్, పోలీస్ జులుం నశించాలి’ అంటూ నిందితులు నినాదాలు చేశారు. దాడి చేసిన వారిలో ఇద్దరు యువతులతోపాటు ఓ కానిస్టేబుల్ కూడా ఉండటం గమనార్హం. ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.
Read Also : సంచలనం : టిక్ టాక్ యాప్ బ్లాక్ చేసిన గూగుల్