Mumbai : డాక్టర్ దంపతుల సన్నిహిత చిత్రాలు దొంగిలించి…మాజీ పనిమనిషి బ్లాక్ మెయిల్
ఇంట్లో దొంగతన చేయటమే కాకుండా ఇంటి దొంగ యజమానిని బ్లాక్ మెయిల్ చేసిన ఘటన ముంబై లో చోటు చేసుకుంది.
Mumbai : ఇంట్లో దొంగతన చేయటమే కాకుండా ఇంటి దొంగ యజమానిని బ్లాక్ మెయిల్ చేసిన ఘటన ముంబై లో చోటు చేసుకుంది. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఖర్ పశ్చిమ ప్రాంతానికి చెందిన వైద్య దంపతులు ఒక ఆసుపత్రిని నిర్వహిస్తున్నారు. అజీజ్ అనే వ్యక్తి పని మనిషిగా వారింట్లో నాలుగేళ్లు పని చేశాడు. 2016లో చేతివాటం ప్రదర్శించి వారు లేని సమయంలో ఇంట్లోని విలువైన వస్తువులు దొంగిలించి పారిపోయాడు. దీంతోవారు పోలీసు స్టేషన్ లో పనిమనిషిపై ఫిర్యాదు చేశారు.
కాగా…. అజీజ్ బీరువాలో నగదు, విలువైన వస్తువులు దొంగిలించుకు పోయేటప్పుడు డాక్టర్ దంపతులు సన్నిహితంగా ఉన్న ఫోటోలను, వీడియోలను కూడా చోరీ చేశాడు. డాక్టర్ దంపతులు కేసు పెట్టంటంతో ఈనెల 24న డాక్టర్ దంపతులు సన్నిహితంగా ఉన్న ఫోటోలను డాక్టర్ భార్యకు వాట్సప్ ద్వారా పంపించి తాను కోరినంత డబ్బు ఇవ్వాలని అజీజ్ డిమాండ్ చేశాడు.
డబ్బులు ఇవ్వకపోతే ఈ ఫోటోలు ఆమె బంధువులు అందరికీ ఫార్వర్డ్ చేస్తానని బెదిరించాడు. దీంతో ఆమె ఈ విషయాన్ని భర్తకు తెలిపింది. వారు ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్ననిందితుడి కోసం గాలించేందుకు ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు.
Also Read : Ananthapuram : భర్తను చంపిన మొదటి భార్య…