Tirupati : నలుగురు పోలీసు అధికారులపై సస్పెన్షన్ వేటు
తిరుపతి జిల్లాలో నలుగురు పోలీసు అధికారులను సస్పెండ్ చేస్తూ జిల్లా ఎస్పీ పరమేశ్వర రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
Tirupati : తిరుపతి జిల్లాలో నలుగురు పోలీసు అధికారులను సస్పెండ్ చేస్తూ జిల్లా ఎస్పీ పరమేశ్వర రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. తిరుచానూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సిగరెట్స్ గౌడౌన్ ను అక్రమంగా ఖాళీ చేయించి అందులోని 20 లక్షల రూపాయలు విలువైన సిగరెట్లు అమ్ముకోటానికి సహకరించారనే కారణంతో వీరిని సస్పెండ్ చేశారు.
సస్పెండైన వారిలో తిరుచానూరు పోలీస్ స్టేషన్ కు చెందిన సిఐ సుబ్రమణ్యం, ముగ్గురు ఎస్ఐ లు రామకృష్ణ, వీరేశ్, రామకృష్ణారెడ్డి లు ఉన్నారు. గోడౌన్ను ఖాళీ చేయించడంతో పాటు సిగరెట్లు అక్రమంగా అమ్మే విషయంలో మణికంఠ, ఇర్ఫాన్, శ్రీనివాస్ అనే వారికి వీరు నలుగురు సహరించినట్లు తేలడంతో జిల్లా ఎస్పీ వీరిని సస్పెండ్ చేశారు.
Also Read :Drugs : ఢిల్లీ-టూ-హైదరాబాద్ డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు