ఇంట్లో పేలిన గ్యాస్‌ సిలిండర్‌.. తల్లీకొడుకు సజీవదహనం

పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో విషాదం నెలకొంది. దొంగతుర్తి గ్రామంలో అర్థరాత్రి ఓ ఇంట్లో గ్యాస్‌ సిలిండర్‌ పేలి ఇద్దరు సజీవదహనమయ్యారు.

  • Published By: veegamteam ,Published On : March 17, 2020 / 02:05 AM IST
ఇంట్లో పేలిన గ్యాస్‌ సిలిండర్‌.. తల్లీకొడుకు సజీవదహనం

పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో విషాదం నెలకొంది. దొంగతుర్తి గ్రామంలో అర్థరాత్రి ఓ ఇంట్లో గ్యాస్‌ సిలిండర్‌ పేలి ఇద్దరు సజీవదహనమయ్యారు.

పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో విషాదం నెలకొంది. దొంగతుర్తి గ్రామంలో అర్థరాత్రి ఓ ఇంట్లో గ్యాస్‌ సిలిండర్‌ పేలి ఇద్దరు సజీవదహనమయ్యారు. సిలిండర్‌ పేలి మంటలు ఇంటికి అంటుకోవడంతో.. అక్కడే నిద్రిస్తున్న తల్లీకొడుకు మంటల్లో చిక్కుకుని సజీవదహనమయ్యారు. సిలిండర్‌ ధాటికి పెంకుటిల్లు కుప్పకూలింది. మంటల్లో చిక్కుకున్న తల్లీకొడుకును కాపాడేందుకు గ్రామస్తులు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఫైర్‌ ఇంజన్‌ వచ్చే సరికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గాఢ నిద్రలో ఉన్నట్లు గ్రామస్తులు భావిస్తున్నారు. సిలిండర్ నుంచి గ్యాస్ లీక్ కావడం ఒక్కసారిగా మంటలు వ్యాపించి, సిలిండర్ పేలిపోయింది. పెంకుటిల్లు కుప్పకూలిపోయింది. బయటికి తప్పించుకోలేక తల్లి యశోద, కొడుకు రోహన్ సజీవ దహనం అయ్యారు. కుటుంబ సభ్యులు, స్థానికులు కపాడే ప్రయత్నం చేశారు. వారిని కాపాడేందుకు చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి.

ఫైర్ ఇంచన్ వచ్చే సరికి ఇళ్లంతా కాలీ పోయింది. తల్లీకొడుకులు సజీవదహనం అయ్యారు. వీరి మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. గ్రామంలో విద్యుత్ నిలిపివేసి సహాయక చర్యలు చేపట్టినా వారిని కాపాడలేకపోయారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.
 

Also Read | ఒంగోలులో కరోనా కలకలం