Girl delivers baby on own: గర్భం దాల్చి ఎవరికీ చెప్పకుండా దాచి పెట్టిన 15 ఏళ్ల బాలిక.. చివరకు యూట్యూబ్ లో వీడియోలు చూసి..

ఆ అమ్మాయి వయసు 15 ఏళ్లు.. ఆమెకు సామాజిక మాధ్యమాల్లో ఓ వ్యక్తితో పరిచయమైంది. ఆ బాలిక అమాయకత్వాన్ని అలుసుగా తీసుకుని ఆమెపై ఆ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ బాలిక గర్భం దాల్చింది. ఈ విషయాన్ని తన తల్లికి చెప్పకుండా దాచి పెడుతూ వచ్చింది ఆ బాలిక.

Girl delivers baby on own: గర్భం దాల్చి ఎవరికీ చెప్పకుండా దాచి పెట్టిన 15 ఏళ్ల బాలిక.. చివరకు యూట్యూబ్ లో వీడియోలు చూసి..

Girl delivers baby on own: ఆ అమ్మాయి వయసు 15 ఏళ్లు.. ఆమెకు సామాజిక మాధ్యమాల్లో ఓ వ్యక్తితో పరిచయమైంది. ఆ బాలిక అమాయకత్వాన్ని అలుసుగా తీసుకుని ఆమెపై ఆ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ బాలిక గర్భం దాల్చింది. ఈ విషయాన్ని తన తల్లికి చెప్పకుండా దాచి పెడుతూ వచ్చింది ఆ బాలిక. తన కడుపుని కూడా కప్పిపెడుతూ, తాను ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నానని ఆ బాలిక ఇంట్లోవారికి చెప్పింది.

కాన్పు సమయంలో తన విషయం తెలిసిపోతుందని భయపడింది. ఎవరి సాయం లేకుండా తన కాన్పు తానే చేసుకోవాలని భావించింది. అందుకోసం యూట్యూబ్ లో వీడియోలు చూసింది. కాన్పు ఎలా చేయాలో నేర్చుకుంది. ఇటీవల ఇంట్లోనే ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చింది.

శిశువు పుట్టిన వెంటనే గొంతునులిమి చంపేసింది. అనంతరం, ఆ శిశువు మృతదేహాన్ని ఓ బాక్సులో పెట్టి, తమ ఇంట్లో దాచి పెట్టింది. చివరకు ఆ బాలిక తల్లి ఈ విషయాన్ని గుర్తించింది. పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో చోటుచేసుకుంది.

ఆ బాలికకు రమేశ్ ఠాకూర్ అనే వ్యక్తి సామాజిక మాధ్యమాల ద్వారా పరిచయం అయ్యాడని, అతడి వలలో పడ్డ బాలిక మోసపోయిందని పోలీసులు చెప్పారు. శిశువును చంపిన బాలికపై హత్యానేరం, బాలికను మోసం చేసిన రమేశ్ పై లైంగిక నేరాల నుంచి బాలల సంరక్షణ చట్టంపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు.

Maharashtra: సీఎంకు రక్తంతో ఆహ్వాన లేఖ రాసి, ఉల్లి పంటను గలబెట్టిన రైతు