Girl’s body in suitcase: 14 ఏళ్ళ బాలికను చంపి, మృతదేహాన్ని దుప్పటితో కప్పి, బ్యాగులో కుక్కిన యువకులు.. ఇద్దరి అరెస్టు

మహారాష్ట్రలో ఇద్దరు యువకులు 14 ఏళ్ళ ఓ అమ్మాయిని చంపి, ఆమె మృతదేహాన్ని దుప్పటితో కప్పి, బ్యాగులో కుక్కారు. అనంతరం ఆ సూట్ కేసును పాల్గర్ లోని వసయీ ప్రాంతంలోని ముంబై-అహ్మదాబాద్ రహదారి పక్కన నాయిగావ్ బ్రిడ్జికి సమీపంలో పడేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న మహారాష్ట్ర పోలీసులు ఇద్దరు నిందితులను గుజరాత్ లో అదుపులోకి తీసుకున్నారు. ఈ హత్య చేయడానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

Girl’s body in suitcase: 14 ఏళ్ళ బాలికను చంపి, మృతదేహాన్ని దుప్పటితో కప్పి, బ్యాగులో కుక్కిన యువకులు.. ఇద్దరి అరెస్టు

Alabama shooting

Girl’s body in suitcase: మహారాష్ట్రలో కొందరు యువకులు 14 ఏళ్ళ ఓ అమ్మాయిని చంపి, ఆమె మృతదేహాన్ని దుప్పటితో కప్పి, బ్యాగులో కుక్కారు. అనంతరం ఆ బ్యాగును పాల్గర్ లోని వసయీ ప్రాంతంలోని ముంబై-అహ్మదాబాద్ రహదారి పక్కన నాయిగావ్ బ్రిడ్జికి సమీపంలో పడేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న మహారాష్ట్ర పోలీసులు ఇద్దరు నిందితులను గుజరాత్ లో అదుపులోకి తీసుకున్నారు. ఈ హత్య చేయడానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

వారం రోజుల క్రితం బ్రిడ్జి వద్ద బాలిక మృతదేహం లభ్యమైందని పోలీసులు వివరించారు. ఆమె శరీరంపై కత్తిపోట్లు ఉన్నాయని చెప్పారు. బాలికను కత్తితో పొడిచి చంపినట్లు తెలుస్తోందని వివరించారు. మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించామని అన్నారు. ఆ బాలిక ముంబైలోని అంధేరీ ప్రాంతంలో నివసించేదని పోలీసులు తెలిపారు.

ఆ బాలిక మృతదేహం లభ్యం కాకముందు రోజే.. ఆమెను దుండగులు కిడ్నాప్ చేసినట్లు ఆమె కుటుంబ సభ్యులు అంధేరీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారని అన్నారు. పాఠశాలకు వెళ్ళిన బాలిక తిరిగి రాలేదని ఆమె కుటుంబ సభ్యులు చెప్పారని వివరించారు. పోలీసులు సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలించి నిందితులను పట్టుకున్నట్లు తెలుస్తోంది. ఆ ఇద్దరు యువకుల వయసు 21 ఉంటుందని పోలీసులు తెలిపారు.

Rains in telangana: తెలంగాణలో నేడు, రేపు వర్షాలు కురిసే అవకాశం