పారిపోయిన ప్రేమ జంట : అమ్మాయి కుటుంబం దాడి..కొడుకు తండ్రి మృతి

  • Published By: madhu ,Published On : October 31, 2020 / 09:00 AM IST
పారిపోయిన ప్రేమ జంట : అమ్మాయి కుటుంబం దాడి..కొడుకు తండ్రి మృతి

Girl’s family attacked : కరీంనగర్‌ జిల్లా బోయినిపల్లిలో దారుణం చోటు చేసుకుంది. కొడుకు ప్రేమ వ్యవహారం ఆ ఇంటి పెద్దను బలితీసుకుంది. బోయినిపల్లి మండలం స్తంభంపల్లిలో తునికి మహేష్, ఎదురింట్లో ఉండే అమ్మాయి గౌతమి కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే వీరి పెళ్లికి అమ్మాయి తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో దసరా రోజున పారిపోయారు.



మరోవైపు పండుగ తర్వాత అమ్మాయికి వేరే అబ్బాయితో పెళ్ళి నిశ్చితార్థం ఉంది. ఇంతలోనే మహేష్ గౌతమిని తీసుకుని పారిపోయాడని అమ్మాయి బంధువులు ఆగ్రహానికి గురైయ్యారు. మహేష్‌ ఇంటికి వెళ్లి అతని కుటుంబ సభ్యులపై విచక్షణారహితంగా దాడి చేశారు.‌



https://10tv.in/madhya-bhopal-a-16-year-old-girl-beat-her-father-for-assaulting-her-mother-and-made-100-dials-to-surrender/
ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ అబ్బాయి తండ్రి లక్ష్మీనారాయణ అస్వస్థతకు గురి కావడంతో వేములవాడ ఆసుపత్రికి తరలించారు. అక్కడ మూడు రోజుల పాటు చికిత్స పొందినా…పరిస్థితి మెరుగు పడలేదు. దాంతో కరీంనగర్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. అయితే…అమ్మాయి బంధువులు కొట్టడంతోనే తన భర్త ప్రాణాలు కోల్పోయాడని మృతుని భార్య ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తుండగా…పారిపోయిన ప్రేమజంట ఆచూకి మాత్రం లభించలేదు. ప్రేమించిన పాపానికి తన భర్త ప్రాణాలు తీసిన వారిని కఠినంగా శిక్షించాలని మృతుని భార్య డిమాండ్ చేస్తుంది.