Girls Missing : సికింద్రాబాద్‌లో కలకలం.. ముగ్గురు అమ్మాయిలు అదృశ్యం, బర్త్‌డే వేడుకులకు వెళ్లి

సికింద్రాబాద్ తిరుమలగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని ముగ్గురు అమ్మాయిలు అదృశ్యం అయ్యారు. పుట్టిన రోజు వేడుకలు జరుపుకునేందుకు బయటకు వెళ్లిన అమ్మాయిలు తిరిగి రాలేదు. దీంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

Girls Missing : సికింద్రాబాద్‌లో కలకలం.. ముగ్గురు అమ్మాయిలు అదృశ్యం, బర్త్‌డే వేడుకులకు వెళ్లి

Girls Missing : సికింద్రాబాద్ తిరుమలగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని ముగ్గురు అమ్మాయిలు అదృశ్యం అయ్యారు. పుట్టిన రోజు వేడుకలు జరుపుకునేందుకు బయటకు వెళ్లిన అమ్మాయిలు తిరిగి రాలేదు. దీంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

మిస్సింగ్ అయిన ముగ్గురు అమ్మాయిల్లో హసీనా ఇంటర్ చదువుతుండగా, మరో అమ్మాయి సకినా పదో తరగతి చదువుతోంది. మరో అమ్మాయి ప్రమీల 9వ తరగతి చదువుతోంది. నిన్న ఉదయం 11 గంటలకు ఇంటి నుంచి బయటకు వెళ్లారు. ఇప్పటివరకు ఇంటికి రాలేదు. విద్యార్థి ప్రమీల తండ్రి సురేశ్ ఇచ్చిన ఫిర్యాదుతో తిరుమలగిరి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేస్తున్నారు.

Also Read..Medico Preeti : ప్రీతిది ముమ్మాటికీ మర్డరే.. తండ్రి నరేంద్ర సంచలన వ్యాఖ్యలు

ముగ్గురు అమ్మాయిల మిస్సింగ్ కలకలం రేపుతోంది. అమ్మాయిల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. తమ పిల్లల క్షేమ సమాచారం తెలియక కంగారు పడుతున్నారు. ముగ్గురు అమ్మాయిలు ఏమయ్యారు? ఎక్కడికి వెళ్లారు? అసలేం జరిగింది? అనేది మిస్టరీగా మారింది. బర్త్ డే వేడుకలకు అని వెళ్లిన అమ్మాయిలు తిరిగి ఇంటికి రాకపోవడం స్థానికంగా తీవ్ర ఆందోళన నింపింది.

Also Read..Harassment Student Died : మెడికో ప్రీతి ఘటన మరువకముందే మరో దారుణం.. సీనియర్ వేధింపులకు విద్యార్థిని బలి

కేసు నమోదు చేసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. దర్యాఫ్తు చేపట్టారు. అమ్మాయిల తల్లిదండ్రులతో మాట్లాడారు. వివరాలు సేకరించారు. ఏ సమయంలో వారు బయటకు వెళ్లారు అనేది అడిగి తెలుసుకున్నారు. సీసీటీవీ ఫుటేజీ పరిశీలిస్తున్న పోలీసులు ఏదైనా క్లూ దొరుకుతుందేమోనని చూస్తున్నారు. త్వరలోనే మిస్సింగ్ మిస్టరీ చేధిస్తామన్నారు. అమ్మాయిల ఆచూకీ కనిపెడతామన్నారు.

Also Read..Abdullapurmet Incident : నవీన్ హత్య కేసు.. వెలుగులోకి మరో ఫోన్ ఆడియో, తనకేమీ తెలియనట్లు నటించిన హరి