స్వామీజీ కిడ్నాప్, రూ.20 కోట్లు డిమాండ్ చేసిన కిడ్నాపర్లు

స్వామీజీ కిడ్నాప్, రూ.20 కోట్లు డిమాండ్ చేసిన కిడ్నాపర్లు

Karnataka Swamiji kidnapped in a movie .. Twists beyond the movie : కర్ణాటకకు చెందిన అమ్మాజీ అనే స్వామిజీని భక్తులే కిడ్నాప్‌ చేసి డబ్బు డిమాండ్ చేసిన ఉదంతం వెలుగు చూసింది. సినీ ఫక్కీలో తనకు గుండె నొప్పి వస్తోందని చెప్పి స్వామీజీ తప్పించుకుని గండం గట్టెక్కారు. బార్లీ జిల్లాలోని కపిలాపూర్‌లో స్వామీజీని దుండగులు కిడ్నాప్ చేశారు. భాస్కర్ రెడ్డి, సతీష్ రెడ్డి అనే ఇద్దరు స్వామీజీ భక్తులు విమానంలో షిరిడీ తీసుకెళ్తామని చెప్పి స్వామిజీని నమ్మించారు. అనంతరం ముగ్గురు కలిసి ఓ కారులో హైదరాబాద్‌కు వచ్చారు. ఆ తర్వాత హైదరాబాద్ నుంచి శంషాబాద్ మీదుగా బెంగుళూరుకు తీసుకెళ్లారు.

స్వామీజీని ఓ గదిలో బంధించిన కిడ్నాపర్లు నాలుగు రోజులపాటు చిత్రహింసలకు గురిచేశారు. అయితే.. రూ.20 కోట్ల నగదు, కిలో బంగారం ఇవ్వాలని కిడ్నాపర్లు స్వామీజీని డిమాండ్ చేశారు. చివరకు రూ.5 కోట్లు ఇస్తానని స్వామీజీ ఒప్పుకోవడంతో తిరిగి హైదరాబాద్‌కు తీసుకువచ్చారు.

హైదరాబాద్‌కు చేరుకోగానే తనకు గుండె నొప్పి వస్తోందని…. వెంటనే ఆస్పత్రిలో చేర్పించాలని స్వామీజీ కిడ్నాపర్లను కోరారు. ఆస్పత్రిలో చేరిన స్వామీజీ కిడ్నాపర్ల గురించి డాక్టర్ల ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చారు. కిడ్నాపర్లను పట్టుకొని లంగర్‌హౌజ్ పోలీసులకు అప్పగించారు.

కాగా… కిడ్నాపర్లపై కేసు నమోదు చేయకుండా లంగర్‌హౌజ్ సీఐ వారిని వదిలిపెట్టారని స్వామీజీ ఆరోపించారు. అయితే…. స్వామీజీ ఫిర్యాదు చేసేందుకు ముందుకు రాలేదని సీఐ చెప్పారు. కిడ్నాపర్లు తన భక్తులేనని, వారిని వదిలేయాలని స్వామీజీ కోరినట్లు వెల్లడించారు.