విహారయాత్రకు వెళ్లి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి

కడప జిల్లా సిద్ధవటంలో విషాదం చోటుచేసుకుంది. విహారయాత్రకు వెళ్లి ఒకే కుటుంబానికి నలుగురు మృతి చెందారు.

విహారయాత్రకు వెళ్లి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి

died

కడప జిల్లా సిద్ధవటంలో విషాదం చోటుచేసుకుంది. విహారయాత్రకు వెళ్లి ఒకే కుటుంబానికి నలుగురు మృతి చెందారు.

కడప జిల్లా సిద్ధవటంలో విషాదం చోటుచేసుకుంది. విహారయాత్రకు వెళ్లి ఒకే కుటుంబానికి నలుగురు మృతి చెందారు. పెన్నానదిలో ఈతకు వెళ్లిన నలుగురు దుర్మరణం చెందారు. మృతులు కర్ణాటక రాయచూరు వాసులుగా గుర్తించారు. కర్ణాటకలోని రాయచూర్‌ ప్రాంతానికి చెందిన ముంతాజ్‌ తన పిల్లలతో కలిసి ఏపీ రాష్ట్రంలోని కడపలోని ప్రకాశ్‌నగర్‌లో ఉన్న తన సోదరుడు అన్వర్‌ ఇంటికి వచ్చింది.

కర్ణాటకలో పాఠశాలలకు సెలవులు కావడంతో పదేళ్లలోపు వయసున్న మదియా, పరియాతో పాటు జోహాన్‌ను తీసుకుని కడపకు వచ్చారు. సిద్ధవటం వద్ద పెన్నానదిని చూసేందుకు ముగ్గురు చిన్నారులతో పాటు మామ అన్వర్‌ వెళ్లారు. సాయంత్రం నదిలో ఈత కొడుతుండగా ప్రమాదవశాత్తు ముగ్గురు చిన్నారులతో పాటు మామ అన్వర్‌ నీటిలో మునిగి మృతి చెందారు.

తొలుత మదియా, పరియా నదిలో మునిగిపోగా.. వారిని కాపాడేందుకు జోహాన్‌ వెళ్లి ఆమె కూడా మృతి చెందింది. వారిని రక్షించేందుకు వెళ్లిన అన్వర్‌ కూడా నదిలో మునిగిపోయారు. ఒకే కుటుంబంలో నలుగురు మృత్యువాత పడటంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.