AP ESI Scam.. ఛార్జిషీట్ రెడీ, త్వరలో మరికొన్ని అరెస్టులు

  • Published By: naveen ,Published On : August 19, 2020 / 01:36 PM IST
AP ESI Scam.. ఛార్జిషీట్ రెడీ, త్వరలో మరికొన్ని అరెస్టులు

ఏపీలో సంచలనం రేపిన ఈఎస్ఐ స్కాంలో కీలక ఆధారాలు దొరికాయని అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) జాయింట్ డైరెక్టర్ రవికుమార్ తెలిపారు. ఇప్పటికే ఈ కేసులో 12 మందిని అరెస్ట్ చేశామన్నారు. మరో ఐదుగురు ఈ కేసులో భాగస్వాములు అయినట్లు గుర్తించామని చెప్పారు. ఈ కేసులో అరెస్ట్ అయిన అచ్చెన్నాయుడు బెయిల్ రాకపోవడంతో ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. ఈ కేసులో కొత్తగా మరో ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు జేడీ తెలిపారు. మాజీ మంత్రి పితాని సత్యనారాయణ కుమారుడు పరారీలో ఉన్నారని, ఆయన పేరు కూడా ఇందులో ఉందని ఏసీబీ జేడీ వెల్లడించారు. ఈ కేసులో మొత్తం 19మంది నిందితులున్నట్లు గుర్తించామని, వారందరిపై కేసు నమోదు చేశామని ఏసీబీ జేడీ చెప్పారు. మందులు, పరికరాలు సప్లయ్ చేసిన ముగ్గురిపై అభియోగాలు నమోదు చేశామన్నారు. ఈఎస్ఐ స్కామ్ లో చార్జిషీట్ దాఖలుకు రంగం సిద్ధం అయ్యింది.