శ్రీనగర్ లో గ్రనేడ్ దాడి : ఆరుగురు జవాన్లకు గాయాలు

జమ్మూకశ్మీర్ లోని శ్రీనగర్ లో సీఆర్పీఎఫ్ జవాన్లపై అనుమానిత ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ ఘటనలో ఆరుగురు జవాన్లు గాయపడ్డారు.

  • Published By: veegamteam ,Published On : October 26, 2019 / 03:11 PM IST
శ్రీనగర్ లో గ్రనేడ్ దాడి : ఆరుగురు జవాన్లకు గాయాలు

జమ్మూకశ్మీర్ లోని శ్రీనగర్ లో సీఆర్పీఎఫ్ జవాన్లపై అనుమానిత ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ ఘటనలో ఆరుగురు జవాన్లు గాయపడ్డారు.

జమ్మూకశ్మీర్ లోని శ్రీనగర్ లో సీఆర్పీఎఫ్ జవాన్లపై అనుమానిత ఉగ్రవాదులు శనివారం (అక్టోబర్ 26, 2019) దాడి చేశారు. ఈ ఘటనలో ఆరుగురు జవాన్లు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం శ్రీనగర్ లోని కరణ్ నగర్ లో సీఆర్పీఎఫ్ జవాన్లపై కొందరు అనుమానిత ఉగ్రవాదులు గ్రనేడ్ దాడి చేశారు. అనంతరం జవాన్లపై కాల్పులు కూడా జరిపారు. 

ఈ ఘటనలో 144 బెటాలియన్ కు చెందిన ఆరుగురు జవాన్లకు గాయాలు అయ్యాయి. వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. సీఆర్పీఎఫ్ టీమ్ తనిఖీలు నిర్వహిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అనంతరం భద్రతా దళాలు సైతం ప్రతిఘటిస్తూ గాల్లోకి కాల్పులు జరిపినట్లు తెలిపారు.