Accident In Aravalli: పాదచారులపైకి దూసుకెళ్ళిన కారు.. ఆరుగురి మృతి.. ఏడుగురికి గాయాలు
గుజరాత్ లో ఇవాళ ఉదయం ఓ కారు బీభత్సం సృష్టించింది. వేగంగా దూసుకువచ్చి ఒక్కసారిగా అదుపుతప్పి పాదచారులపైకి దూసుకెళ్ళింది. దీంతో ఆరుగురు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో మరో ఏడుగురికి గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించిన పోలీసులు చికిత్స అందిస్తున్నారు. కారు డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
Accident In Aravalli: గుజరాత్ లో ఇవాళ ఉదయం ఓ కారు బీభత్సం సృష్టించింది. వేగంగా దూసుకువచ్చి ఒక్కసారిగా అదుపుతప్పి పాదచారులపైకి దూసుకెళ్ళింది. దీంతో ఆరుగురు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో మరో ఏడుగురికి గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించిన పోలీసులు చికిత్స అందిస్తున్నారు. కారు డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇవాళ ఉదయం పలువురు పనులకు వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వారంతా అంబాజీకి వెళ్తున్నారని, రోడ్డు పక్కకు కారు దూసుకువచ్చిందని అధికారులు తెలిపారు. ప్రమాదంలో చనిపోయిన వారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.