Accident In Aravalli: పాదచారులపైకి దూసుకెళ్ళిన కారు.. ఆరుగురి మృతి.. ఏడుగురికి గాయాలు

 గుజరాత్ లో ఇవాళ ఉదయం ఓ కారు బీభత్సం సృష్టించింది. వేగంగా దూసుకువచ్చి ఒక్కసారిగా అదుపుతప్పి పాదచారులపైకి దూసుకెళ్ళింది. దీంతో ఆరుగురు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో మరో ఏడుగురికి గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించిన పోలీసులు చికిత్స అందిస్తున్నారు. కారు డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

Accident In Aravalli: పాదచారులపైకి దూసుకెళ్ళిన కారు.. ఆరుగురి మృతి.. ఏడుగురికి గాయాలు

Accident In Aravalli

Accident In Aravalli: గుజరాత్ లో ఇవాళ ఉదయం ఓ కారు బీభత్సం సృష్టించింది. వేగంగా దూసుకువచ్చి ఒక్కసారిగా అదుపుతప్పి పాదచారులపైకి దూసుకెళ్ళింది. దీంతో ఆరుగురు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో మరో ఏడుగురికి గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించిన పోలీసులు చికిత్స అందిస్తున్నారు. కారు డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇవాళ ఉదయం పలువురు పనులకు వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వారంతా అంబాజీకి వెళ్తున్నారని, రోడ్డు పక్కకు కారు దూసుకువచ్చిందని అధికారులు తెలిపారు. ప్రమాదంలో చనిపోయిన వారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

India exercising with Russia: అమెరికా ఆందోళన వ్యక్తం చేసినప్పటికీ రష్యా చేపట్టిన విన్యాసాల్లో పాల్గొన్న భారత్