కరోనాతో మోస్ట్ వాంటెడ్ దావుద్ ఇబ్రహీం మృతి..?!
వంద గొడ్లు తిన్న రాబందు ఒక్క గాలివానతో ఖతమవుతుందంటారు.. అచ్చంగా ఇప్పుడు దావూద్ ఇబ్రహీం సిచ్యుయేషన్ కూడా అలానే తయారైంది. భారత్లో నరమేథం సృష్టించి పొరుగు దేశం పారిపోయిన మిస్టర్ డి ఇప్పుడు కరోనా సోకి మృతిచెందినట్టు సోషల్ మీడియాలో పుకార్లు వినిపిస్తున్నాయి. ఇన్నాళ్లూ భారత్ ఎంత మొత్తుకున్నా డి గ్యాంగ్ని కాపాడుకుంటూ వచ్చిన పాకిస్తాన్… తాజా పరిణామంతో ఉలిక్కిపడింది.. వైరస్ బారిన పడిన అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకి ఇప్పుడు 64ఏళ్లు. అంటే కరోనా సోకితే ప్రాణాలు పోగొట్టుకునే ఏజ్ గ్రూప్.. దీనికి తోడు కొన్నేళ్లుగా ఇతగాడికి బిపి, షుగర్ రోగాలున్నాయంటారు..
అంటే మరీ రిస్క్ గ్రూప్ అన్నమాట.. దీంతో దావూద్ ఇబ్రహీం ఒక్కడే కాదు.. అతనితో పాటు వైరస్ దాడి చేసిన అతని భార్యని కూడా కరాచీ మిలట్రీ ఆస్పత్రికి తరలించారని తెలుస్తోంది.. దావూద్ ఇబ్రహీం సెక్యూరిటీని.. పర్సనల్ సిబ్బందిని కూడా హోమ్ క్వారంటైన్కి తరలించారని అంటున్నారు.. ఈ క్రమంలోనే దావూద్ ఇబ్రహీం కరోనాతో మృతి చెందాడని పాకిస్తాన్కు చెందిన న్యూస్ ఎక్స్ మీడియా శనివారం ఓ కథనాన్ని ప్రచురించింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ దావూద్ మృతి చెందాడని నివేదించింది. ఈ వార్త కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
#BreakingNews | Dawood Ibrahim dies of COVID-19 in Karachi: Sources pic.twitter.com/BQUZtjEIZ3
— NewsX (@NewsX) June 6, 2020
మరోవైపు దావూద్ ఇబ్రహీంకు వైరస్ సోకినట్లు తేలడంతో.. ఇన్నాళ్లూ అతన్ని అంటిపెట్టుకుని తిరిగి దందాలు చేసినవాళ్లంతా కూడా టెన్షన్లో పడ్డారట. ఇన్నాళ్లూ పోలీసులకు దొరక్కుండా తప్పించుకుని తిరిగినా.. వైరస్ దెబ్బతో చచ్చినట్లు లొంగిపోవాల్సి వస్తుందేమో అనే భయంతో బతుకున్నారుంటున్నారు. దావూద్ ఇబ్రహీం కుటుంబం కూడా ఇప్పుడు క్వారంటైన్లో ఉన్నట్లు చెప్తున్నారు.. దావూద్ భార్య పేరు మెహ్జాబిన్ అలియాస్ జుబీనా జరైన్. దావూద్, జుబీనాకు నలుగురు పిల్లలు. ఇందులో మహరూక్, మెహ్రీన్, మారియాలు కూతుళ్లు కాగా, మోయిన్ అనే అబ్బాయి కూడా ఉన్నాడు.
ముంబైలో అండర్ వరల్డ్డాన్గా చలామణీ అవుతూ..నేరాలకు పాల్పడిన దావూద్ ఇబ్రహీం బాంబే సీరియల్ బ్లాస్ట్స్ కేసులో ప్రధానసూత్రధారి.. మార్చి 12 1993న జరిగిన పేలుళ్లలో 317మంది చనిపోగా..1400మంది గాయపడ్డారు.. ఈకేసులోనే దోషులుగా తేలిన యాకూబ్ మెమన్ని 2015లో ఉరి తీసారు. ఇంకా చాలామందిని అరెస్ట్ చేసినా…దావూద్ ఇబ్రహీం మాత్రం పాకిస్తాన్ పారిపోయాడు.. అప్పట్నుంచి అతన్ని అప్పగించమని భారత్ కోరుతున్నా.. పాకిస్తాన్ దొంగనాటకాలు ఆడుతుందే తప్ప మనకి మాత్రం అప్పగించడం లేదు. అలాంటి దుర్మార్గ చక్రవర్తికి ఇప్పుడు కరోనా సోకడంతో మృతిచెందినట్టు సోషల్ మీడియాలో కూడా కామెంట్లు పెడుతున్నారు. డెస్టినీ డిసైడ్స్ అంటే ఇదేనేమోనని అంటున్నారు.
ఇదిలా ఉండగా, దావూద్ కరోనాతో మృతిచెందినట్టు ఎలాంటి స్పష్టత లేదు. దావూద్ మృతికి సంబంధించి సరైన వాస్తవాలు ఇప్పటివరకూ బయటకు రాలేదు. గతంలోనూ పలు సందర్భాల్లో దావూద్ మృతిచెందాడంటూ ఎన్నో వార్త కథనాలు, పుకార్లు వినిపించాయి.