శంషాబాద్ ఎయిర్ పోర్టులో హై ఎలర్ట్
శంషాబాద్ ఎయిర్ పోర్టులో హై ఎలర్ట్ ప్రకటించారు. జనవరి26 రిపబ్లిక్ డే సందర్భంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఎయిర్ పోర్టులో సందర్శకులకు పాసుల జారీని నిలిపివేశారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.
జనవరి 31 వరకు హై ఎలర్ట్ ఉంటుందని నిఘా వర్గాలు తెలిపాయి.ఇంటిలిజెన్స్ బ్యూరో హెచ్చరికల నేపధ్యంలో హై ఎలర్ట్ ప్రకటించారు. 26 న రిపబ్లిక్ డే నాడు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భద్రతను కట్టుదిట్టంచేశారు. హై ఎలర్ట్ ప్రకటించారు. ఎయిర్ పోర్టులోకివచ్చి వెళ్లే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.