ప్రియాంక హంతకులను మేమే చంపేస్తాం : షాద్ నగర్ లో హైటెన్షన్

షాద్ నగర్ లో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. డాక్టర్ ప్రియాంకరెడ్డి హంతకులను ఉరి తీయాలంటూ జనం రోడ్డెక్కారు. వేలాది మంది రోడ్డుపైకి వచ్చారు. ఆందోళనలు,

  • Published By: veegamteam ,Published On : November 30, 2019 / 07:35 AM IST
ప్రియాంక హంతకులను మేమే చంపేస్తాం : షాద్ నగర్ లో హైటెన్షన్

షాద్ నగర్ లో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. డాక్టర్ ప్రియాంకరెడ్డి హంతకులను ఉరి తీయాలంటూ జనం రోడ్డెక్కారు. వేలాది మంది రోడ్డుపైకి వచ్చారు. ఆందోళనలు,

షాద్ నగర్ లో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. డాక్టర్ ప్రియాంకరెడ్డి హంతకులను ఉరి తీయాలంటూ జనం రోడ్డెక్కారు. వేలాది మంది రోడ్డుపైకి వచ్చారు. ఆందోళనలు, నిరసనలతో హోరెత్తిస్తున్నారు. నిందితులు షాద్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఉన్నారని తెలిసి ప్రజలు పెద్ద సంఖ్యలో అక్కడికి వెళ్లారు. పోలీస్ స్టేషన్ లోకి వెళ్లే ప్రయత్నం చేశారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. ఆగ్రహంతో రగిలిపోతున్న ఆందోళనకారులను కంట్రోల్ చేయడం పోలీసుల వల్ల కావడం లేదు. నిందితులను కోర్టుకి తరలించే వీలు లేకపోవడంతో పోలీసులు లాఠీలకు పని చెప్పారు. రోడ్డుపై ఉన్న ఆందోళనకారులను చెదరగొట్టేందుకు లాఠీ చార్జ్ చేశారు. దీంతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

షాద్ నగర్ పోలీస్ స్టేషన్ దగ్గర ముందు జాగ్రత్తగా భారీగా పోలీసు బలగాలు మోహరించారు. ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరక్కుండా చర్యలు తీసుకోవాలని పోలీసులను ఉన్నతాధికారులు ఆదేశించారు.

పోలీసులు లాఠీచార్జ్ చేసినా జనం మాత్రం వెనక్కి తగ్గడం లేదు. రోడ్లపై బైఠాయించారు. నిందితులను బహిరంగంగా ఉరి తీయాల్సిందే అని డిమాండ్ చేస్తున్నారు. కాగా కొందరు స్థానికులు పోలీస్ స్టేషన్ ముందే బైఠాయించారు. నిందితులను తమకు అప్పగించాలని, వారిని మేమే చంపేస్తామని ఆగ్రహంతో ఊగిపోతున్నారు. వేలాదిగా తరలివచ్చిన ఆందోళనకారులను కంట్రోల్ చేయలేక పోలీసులు ఇబ్బందులు పడుతున్నారు.