ఉరి తీయాల్సిందే : ప్రియాంక హంతకులున్న షాద్ నగర్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉద్రిక్తత

షాద్ నగర్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్య కేసు నిందితులు ఈ పోలీస్ స్టేషన్ లో ఉన్నారు. విషయం తెలుసుకున్న స్థానికులు, విద్యార్థులు పెద్ద

  • Published By: veegamteam ,Published On : November 30, 2019 / 05:50 AM IST
ఉరి తీయాల్సిందే : ప్రియాంక హంతకులున్న షాద్ నగర్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉద్రిక్తత

షాద్ నగర్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్య కేసు నిందితులు ఈ పోలీస్ స్టేషన్ లో ఉన్నారు. విషయం తెలుసుకున్న స్థానికులు, విద్యార్థులు పెద్ద

షాద్ నగర్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్య కేసు నిందితులు ఈ పోలీస్ స్టేషన్ లో ఉన్నారు. విషయం తెలుసుకున్న ప్రజా సంఘాల నాయకులు, స్థానికులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పీఎస్ దగ్గరికి వచ్చారు. ప్రియాంక హంతకులను ఉరి తీయాల్సిందే అని, ఎన్ కౌంటర్ చేయాల్సిందే అని డిమాండ్ చేస్తున్నారు. నలుగురు నిందితుల దిష్టి బొమ్మలను చెట్టుకి ఉరితీసి విద్యార్థినులు నిరసన తెలిపారు. స్థానికులు పీఎస్ లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, స్థానికులకు మధ్య వాగ్వాదం జరిగింది. ముందు జాగ్రత్తగా పోలీస్ స్టేషన్ దగ్గర భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఆందోళన చేస్తున్న వారిని కంట్రోల్ చేయడం పోలీసులకు కష్టంగా మారింది.

శనివారం(నవంబర్ 30,2019) ప్రియాంక హత్య కేసు నిందితులను పోలీసులు ఫాస్ట్ ట్రాక్ కోర్టులో హాజరుపరచనున్నారు. ఇందుకోసం శంషాబాద్ పీఎస్ నుంచి షాద్ నగర్ పీఎస్ కి నిందితులను తీసుకొచ్చారు. ప్రభుత్వ ఆసుపత్రిలో నలుగురికీ వైద్య పరీక్షలు చేయిస్తారు. ఆ తర్వాత మహబూబ్ నగర్ కి తరలిస్తారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులో వారిని హాజరుపరుస్తారు. మరింత దర్యాఫ్తు కోసం నిందితులను కస్టడీకి అప్పగించాలని పోలీసులు కోర్టులో అవకాశం ఉందని తెలుస్తోంది.

ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ వేగంగా జరిగేలా చూస్తామని శంషాబాద్ డీసీపీ తెలిపారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా చూస్తామన్నారు. అలాగే సిద్దులగుట్టలో మహిళ అనుమానాస్పద మృతిపైనా విచారణ చేస్తున్నామన్నారు. మహిళ ఒంటరిగా వెళ్తున్నట్టు సీసీ ఫుటేజ్ లో కనిపించిందన్నారు. త్వరలోనే మిస్టరీని చేధిస్తామన్నారు.

ఈ కేసులో మహ్మద్ ఏ1, జొల్లు శివ ఏ2, జొల్లు నవీన్ ఏ3, చెన్నకేశవులు ఏ4 నిందితులు. మాయమాటల చెప్పి డాక్టర్ ప్రియాంకను బలి తీసుకున్నారు. లైంగిక దాడి చేసి ప్రాణం తీశారు. ఆ ఎవరూ గుర్తు పట్టకుండా మృతదేహాన్ని తగులబెట్టారు.