Assam: అనుమానాస్పదంగా యువకుడి మృతి.. ఆ విషయంలో అడ్డు చెప్పినందుకు ప్రేయసి కుటుంబమే చంపిందా?

ఒక యువకుడి మరణం వివాదాస్పదంగా మారింది. చెట్టుకు వేలాడుతూ కనిపించిన అతడి మరణానికి ప్రేమ వ్యవహారమే కారణమని యువకుడి కుటుంబ సభ్యులు అంటున్నారు. ఈ ఘటన అసోంలో జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలివి.

Assam: అనుమానాస్పదంగా యువకుడి మృతి.. ఆ విషయంలో అడ్డు చెప్పినందుకు ప్రేయసి కుటుంబమే చంపిందా?

Assam: అసోంలో ఒక యువకుడి మరణం వివాదానికి దారి తీసింది. అసోంలోని ఒక గ్రామానికి చెందిన బికి బిశాల్ అనే యువకుడి మృతదేహం గత సోమవారం ఒక చెట్టుకు వేలాడుతున్న స్థితిలో కనిపించింది. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఆత్మహత్య అయ్యుండొచ్చని అనుమానించారు.

Caught On Camera: టోల్ ప్లాజా దగ్గర గొడవ.. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న మహిళలు.. వీడియో వైరల్

కానీ, బిశాల్ కుటుంబ సభ్యులు మాత్రం అది హత్యే అంటున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బిశాల్, స్థానికంగా ఒక యువతిని ప్రేమించాడు. ఇద్దరూ ఆదివాసీలే అయినా.. బిశాల్ హిందువు కాగా, యువతి క్రిస్టియన్ సామాజిక వర్గానికి చెందింది. వీరి ప్రేమ వ్యవహారం యువతి ఇంట్లో తెలిసింది. అయితే, వాళ్లు బిశాల్‌ను తమ సామాజిక వర్గంలోకి మారాలి అని బలవంతపెట్టినట్లు యువకుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. యువతి తండ్రి, మామయ్యలు, ఇద్దరు చర్చి ఫాదర్లతో కలిపి మొత్తం ఐదుగురు కలిసి యువకుడిపై ఒత్తిడి తెచ్చారని, దీనికి బిశాల్ అంగీకరించలేదని అతడి కుటుంబ సభ్యులు అంటున్నారు. వాళ్లంతా బిశాల్ ఇంటికి వచ్చి బలవంతపెట్టారని ఆరోపించారు. సోమవారం ఒక కాల్ రావడంతో బయటకు వెళ్లాడని, తర్వాత తిరిగి రాలేదని వారు చెబుతున్నారు.

Kishan Reddy: వచ్చే ఏడాది సెప్టెంబర్ 17 వరకు విమోచన దినోత్సవాలు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

ఈ క్రమంలోనే అతడి మృతదేహం చెట్టుకు వేలాడుతూ కనిపించింది. కాగా, అతడి మృతదేహంపై రక్తపు మరకలు, గాయాలు ఉన్నాయని స్నేహితులు, బంధువులు చెబుతున్నారు. ఈ ఘటనపై హత్య కేసుగా నమోదు చేసి, యువతి కుటుంబ సభ్యులపై విచారణ జరపాలని వాళ్లు డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు ఇదే కోణంలో విచారణ ప్రారంభించారు. ఇటీవల నలుగురిని లఖీంపూర్ ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు. కాగా, బిశాల్ ఆత్యహత్య చేసుకున్నాడా.. లేక హత్యకు గురయ్యాడా అనేది విచారణలో తేలుతుందని పోలీసులు అంటున్నారు. అయితే, ఈ ఘటనపై హిందూ సంఘాలు ఆందోళనకు దిగాయి.