భార్యకు వాతలు పెడుతూ..కొడుకుతో వీడియో తీయించిన శాడిస్టు

  • Published By: veegamteam ,Published On : February 27, 2020 / 09:21 AM IST
భార్యకు వాతలు పెడుతూ..కొడుకుతో వీడియో తీయించిన శాడిస్టు

ఓ శాడిస్ట్ భర్త భార్యను పెట్టిన హింసల గురించి తెలుసుకుంటే ఒళ్లు జలదరిస్తుంది. వీడు మనిషేనా? లేక మనిషి రూపంలో ఉన్న రాక్షసుడా? అనే అనుమానం వస్తుంది. భార్యను అమానుషంగా కొట్టి..తలపై ఇనుపరాడ్డుతో బలంగా బాది..తలనుంచి రక్తం ధారగా కారుతున్నా ఆ రాక్షసుడికి కనికరం కలగలేదు. భార్యను కొడుకు కళ్లముందే వివస్త్రను చేసాడు. విచక్షణ మరచి రాక్షసుడిలా మారాడు.

ఇనుప కడ్డీలతో భార్య శరీరం నిండా వాతలు పెట్టాడు. ఆ దారుణాన్ని కొడుకుతో సెల్ ఫోన్ తో షూట్ చేయించాడు. ఈ శాడిస్ట్ భర్త అఘాయిత్యాలకు..భర్త కొడుతున్న దెబ్బలకు..పెడుతున్న హింసలను సహించి..భరించి ఇక తట్టుకోలేని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన నార్సింగ్ పీఎస్ పరిధిలోని కోకాపేట నెమలినగర్ లో చోటుచేసుకుంది. 

వివారాల్లోకి వెళితే..కోకాపేటలో శ్రీనివాస్ భార్య కొడుకుతో నివాసముంటున్నాడు. ఈ  క్రమంలో భార్యపై అనుమానం పెంచుకున్నాడు. దీంతో భార్యను ప్రతీరోజు దారుణంగా కొట్టేవాడు. ఆ హింసలు గత రెండు రోజుల నుంచీ మరీ పెరిగాయి. భార్య తలపై ఇనుప రాడ్డుతో కొట్టాడు శ్రీనివాస్. తలనుంచి ధారగా రక్తం కారుతుంటే బాధ తట్టుకోలేని తల్లడిల్లిపోయిందామె. అక్కడికీ అతని శాడిజం తీరలేదు. కన్న కొడుకు ముందే ఆమె బట్టలు విప్పేసి ఇనుప కడ్డీలను ఎర్రగా కాల్చి ఆమె శరీరం నిండా వాతలు పెట్టాడు. ఈ దారుణాన్ని అంతా కొడుకుతో సెల్ ఫోన్ లో షూట్ చేయించాడు. ఆమె బాధతో విలవిల్లాడుతుంటే శ్రీనివాస్ మనిషి అనే సంగతి కూడా మరచిపోయి పైశాచికంగా ఆనందాన్ని పొందాడు. 

భర్త నుంచి ఎలాగోలా తప్పించుకున్న ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆమెను చికిత్స కోసం హాస్పిటల్ కు తరలించారు.అనంతరం  శ్రీనివాస్ ను అదుపులోకి తీసుకున్నారు. సెల్ ఫోన్ లో చిత్రీకరించిన దృశ్యాలను చూసి పోలీసులు సైతం శ్రీనివాస్ రాక్షసత్వానికి ఆశ్చర్యపోయారు. ఆ దృశ్యాలను చూస్తే అన్ని హింసలు ఎలా భరించావు తల్లీ..అని అనుకోకమానరు. నవ్వు మనిషివా రాక్షసుడివా అంటూ తమదైన శైలిలో విచారణ చేపట్టారు.  కేసు నమోదు చేసుకున్న నార్శింగ్ సీఐ గంగాధర్ దర్యాప్తు కొనసాగిస్తున్నారు.  

Read More>>ముకేశ్ అంబానీ గంటకు ఆదాయం ఎంతో తెలుసా