వేట మొదలెట్టారు : సిటీ బస్సులో కాల్పులు జరిపింది ఏపీ పోలీస్

హైదరాబాద్ పంజాగుట్టలో ఆర్టీసీకి చెందిన సిటీ బస్సులో కాల్పులు జరిపిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు. కాల్పులు జరిపిన వ్యక్తి ఓ పోలీసు అధికారి. ఆయన పేరు శ్రీనివాస్. ఏపీ

  • Published By: veegamteam ,Published On : May 2, 2019 / 11:46 AM IST
వేట మొదలెట్టారు : సిటీ బస్సులో కాల్పులు జరిపింది ఏపీ పోలీస్

హైదరాబాద్ పంజాగుట్టలో ఆర్టీసీకి చెందిన సిటీ బస్సులో కాల్పులు జరిపిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు. కాల్పులు జరిపిన వ్యక్తి ఓ పోలీసు అధికారి. ఆయన పేరు శ్రీనివాస్. ఏపీ

హైదరాబాద్ పంజాగుట్టలో ఆర్టీసీకి చెందిన సిటీ బస్సులో కాల్పులు జరిపిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు. కాల్పులు జరిపిన వ్యక్తి ఓ పోలీసు అధికారి. ఆయన పేరు శ్రీనివాస్. ఏపీ ఇంటెలిజెన్స్  సెక్యూరిటీ వింగ్ లో శ్రీనివాస్ పని చేస్తున్నారు. శ్రీనివాస్ ను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. శ్రీనివాస్ ఒక ప్రముఖుడి దగ్గర సెక్యూరిటీ అధికారిగా పని చేస్తున్నారు. డ్యూటీ  ముగించుకుని ఆర్టీసీ బస్సు ఎక్కారు. బస్సులో తోటి ప్రయాణికులతో ఆయన గొడవపడ్డారు. ఆ కోపంలో తన దగ్గర ఉన్న గన్ తో కాల్పులు జరిపారు. సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా కాల్పులు జరిపిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు.

గురువారం (మే 2,2019) సికింద్రాబాద్ నుంచి మణికొండ వెళుతున్న బస్సు (47 ఎల్) నెంబర్ AP 28 Z 4468.. పంజాగుట్ట దగ్గరకు రాగానే ఈ ఘటన చోటు చేసుకుంది. బస్సులో  ప్రయాణీకుల మధ్య ఘర్షణ జరిగింది. బస్సు దిగమన్నందుకు శ్రీనివాస్ కాల్పులకు తెగబడ్డాడు. గన్ నుంచి బయటకు వచ్చిన బుల్లెట్.. బస్సు టాప్ నుండి దూసుకెళ్లింది. ఈ ఘటనతో  బస్సులోని ప్రయాణీకులు ఒక్కసారిగా భయాందోళకు గురయ్యారు.

కాల్పుల ఘటన తర్వాత భయపడిన బస్సు డ్రైవర్ బస్సును ఆపకుండానే వెళ్లిపోయాడు. వెంటనే విషయం తెలుసుకుని రంగంలోకి దిగిన పోలీసులు, కాల్పులు జరిపిన వ్యక్తిని పట్టుకునేందుకు గాలింపు చేపట్టారు. కాల్పులకు తెగబడిన వ్యక్తి సఫారీ డ్రెస్ వేసుకుని ఉన్నాడని ప్రయాణికులు చెప్పడంతో.. అతడు గన్‌మెన్‌ గా పని చేస్తాడని పోలీసులు గుర్తించారు. ఈ కేసుని సీరియస్ గా తీసుకున్న పోలీసులు గంటల  వ్యవధిలోనే కాల్పులు జరిపిన వ్యక్తిని ఐడెంటిఫై చేశారు. శ్రీనివాస్ కాల్పుల వ్యవహారంపై హైదరాబాద్ పోలీసులు ఏపీ డీజీపీకి సమాచారం ఇచ్చారు. దీనిపై ఆయన ఆరా తీశారు. జనాల మధ్య కాల్పులు జరపడం చాలా పెద్ద నేరం. దీంతో డీజీపీ ఠాకూర్ దీన్ని సీరియస్ గా తీసుకున్నట్టు సమాచారం. కాల్పులు జరిపిన వ్యకిపై కఠిన చర్యలు తీసుకునే ఛాన్స్ ఉంది.