నీళ్ల ట్యాంకులో భారీగా అక్రమ మద్యం.. అడ్డంగా బుక్కయ్యారు!

  • Published By: sreehari ,Published On : September 5, 2020 / 06:23 PM IST
నీళ్ల ట్యాంకులో భారీగా అక్రమ మద్యం.. అడ్డంగా బుక్కయ్యారు!

అది పైకి నీళ్ల ట్యాంకే.. అందులో నీళ్లు లేవు.. అంతా అక్రమ మద్యమే.. మాములుగా తరలిస్తే ఎక్కడ దొరికిపోతామోనన్న భయంతో అక్రమ మద్యందారులు ఇలా నీళ్ల ట్యాంకర్ లో పెట్టి తరలిస్తున్నారు. పోలీసుల కళ్లుగప్పి అక్రమ మద్యాన్ని తరలించబోయి అడ్డంగా దొరికిపోయారు.. ఈ ఘటన గుంటూరు జిల్లా మునుగోడు మండలం అమరావతి వద్ద జరిగింది. భారీగా అక్రమ మద్యం బాటిళ్లను పోలీసులు పట్టుకున్నారు.



తెలంగాణ నుంచి నీళ్ల ట్యాంకర్‌లో మద్యం తరలిస్తున్న సత్తెనపల్లి మండలం అబ్బూరుకు చెందిన ఎనిమిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముందస్తు సమాచారంతో పోలీసులు నిఘా పెట్టి వారిని పట్టుకున్నారు. సుమారు 10వేల మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.



పోలీసులు సోదాలు చేస్తున్నా తెలంగాణ నుంచి మద్యం అక్రమ రవాణా కొనసాగుతూనే ఉంది. పోలీసులను బురిడీ కొట్టేంచేందుకు అక్రమదారులు ఎప్పటికప్పుడూ కొత్త దారుల్లో అక్రమ మద్యాన్ని తరలించే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.