Singapore: సింగపూర్ ఉద్యోగి కొలీగ్ వేలు కొరికేసిన ఇండియన్‌కు పదేళ్ల జైలు శిక్ష

కొలీగ్ అయిన సింగపూర్ ఉద్యోగి వేలు కొరికేసిన భారతీయుడికి పదేళ్ల జైలు శిక్ష విధించారు. లోగన్ గోవిందరాజ్ అనే వ్యక్తి 42ఏళ్ల ముత్తు సెల్వం ఎడమ చేతి చిటికెన వేలు కొరేకేశాడు.

Singapore: సింగపూర్ ఉద్యోగి కొలీగ్ వేలు కొరికేసిన ఇండియన్‌కు పదేళ్ల జైలు శిక్ష

Singapore

Singapore: కొలీగ్ అయిన సింగపూర్ ఉద్యోగి వేలు కొరికేసిన భారతీయుడికి పదేళ్ల జైలు శిక్ష విధించారు. లోగన్ గోవిందరాజ్ అనే వ్యక్తి 42ఏళ్ల ముత్తు సెల్వం ఎడమ చేతి చిటికెన వేలు కొరేకేశాడు. వైద్యులు అతికించేందుకు ప్రయత్నించినప్పటికీ సాధ్యపడకపోవడంతో లబోదిబోమంటున్నాడు సెల్వం.

2020 డిసెంబర్ 6వ తేదీ సాయంత్రం 4గంటల 30నిమిషాలకు గోవింద రాజ్, సెల్వంతో పాటు మరో వ్యక్తితో కలిసి మ్యూజిక్ వింటూ ఆల్కహాల్ తాగుతున్నారు. సింగపూర్ వెస్ట్ కోస్ట్‌లోని డార్మిటరీకి దగ్గర్లోని లారీలో ఈ ఘటన జరిగిందని పోలీసులు చెబుతున్నారు.

ఘటనకు ముందు గోవిందరాజ్ కనీసం మూడు క్యాన్ల బీర్ తాగి ఉండొచ్చని కోర్ట్ చెబుతుంది.

Read Also: హైకోర్టు ఆవరణలో కోక్ తాగిన పోలీస్.. వింత శిక్ష విధించిన జడ్జి

మద్యం మత్తులో గోవిందరాజ్, సెల్వంను తిట్టాడు. డార్మిటరీలో ఇతర వ్యక్తులతో కలిసి నీచమైన పనులు చేస్తున్నావంటూ దూషించాడు. ఇద్దరు కలిసి లారీ ఎక్కిన సమయంలో ఒకరినొకరు తోపులాటతో కూడిన దూషణలు దిగారు. సెల్వం అతణ్ని తోసేసి ఎడమ చేతిని ఛాతీపై నొక్కి పెట్టి వార్నింగ్ ఇచ్చాడు.

‘గోవిందరాజ్ ను చెంపదెబ్బ కొట్టి, చొక్కా పట్టుకులాగి పడేయడంతో సెల్వంను గాయపరిచాడని’ డిప్యూటీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెలిస్సా లీ కోర్టులో వెల్లడించారు.

గొడవ జరుగుతున్న సమయంలో చిటికెన్ వేలు తెగిపడినట్లు గుర్తించలేదు. క్లీనింగ్ చేస్తున్న సమయంలో వేలి ముక్క కనిపించడంతో కొలీగ్స్ ను అంబులెన్స్ ను పిలవమని చెప్పి కూ టెక్ పాట్ హాస్పిటల్ కు వెళ్లి ట్రీట్మెంట్ తీసుకున్నాడు. అతనిపై కేసు నమోదుకాగా కోర్టు పదేళ్ల పాటు జైలు శిక్ష విధించి, జరిమానా కట్టాలని ఆదేశించింది.

Read Also: పాలిస్తుండగా తల్లులను ఫొటో తీస్తే జైలుకే