సంక్రాంతి దొంగలు : నగరంలోకి అంతరాష్ట్ర ముఠా

  • Published By: veegamteam ,Published On : January 5, 2019 / 10:02 AM IST
సంక్రాంతి దొంగలు : నగరంలోకి అంతరాష్ట్ర ముఠా

హైదరాబాద్: సంక్రాంతి వచ్చిందంటే చాలు దొంగలకు పండగే. చోరీలు చేసుకోవడానికి వారికి అడ్డుఅదుపూ ఉండదు. సంక్రాంతి పండుగ రావడంతో అంతరాష్ట్ర దొంగల ముఠా నగరంలోకి చొరబడింది. సంక్రాంతి పండక్కి ఊరెళ్లిన వారి ఇళ్లను టార్గెట్ చేశారు. తాళం వేసిన ఇళ్లను గుర్తించి దొంగతనాలకు పాల్పడుతున్నారు. కేపీహెచ్‌బీ పరిధిలో పలు ఇళ్లలో దొంగతనాలకు యత్నించారు. సీసీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాల ఆధారంగా దొంగల ముఠా కోసం పోలీసులు గాలిస్తున్నారు.
ఊరెళ్లేవారికి గమనిక:
దొంగల ముఠా వచ్చేసిందన్న వార్తలు నగరవాసుల్లో ఆందోళన నింపింది. రాత్రిళ్లు భయం భయంగా గడుపుతున్నారు. ఎటువైపు నుంచి దొంగలు విరుచుకుపడతారోనని హడలిపోతున్నారు. ప్రతి ఏటా సంక్రాంతి పండక్కి నగరం నుంచి లక్షలాది మంది సొంతూళ్లకు వెళతారు. దీంతో సరిగ్గా సమయానికి దొంగలు ఎంట్రీ ఇస్తున్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన ముఠాలు రంగంలోకి దిగుతున్నాయి. ఉదయం అంతా రెక్కీ నిర్వహించి రాత్రికి పని కానిస్తున్నారు. పండక్కి ఊరు వెళ్లే వారు సమీప పోలీస్‌స్టేషన్లలో సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచిస్తున్నారు.