మర్డర్ మిస్టరీ : గొంతు కోసి.. ఇంటర్ విద్యార్థిని దారుణ హత్య

కరీంనగర్ జిల్లా విద్యానగర్ లో దారుణం జరిగింది. ఓ ఇంటర్ విద్యార్థిని దారుణ హత్యకు గురైంది. మృతురాలిని రాధికగా గుర్తించారు. సోమవారం(ఫిబ్రవరి 10,2020) సాయంత్రం రాధిక

  • Published By: veegamteam ,Published On : February 10, 2020 / 02:37 PM IST
మర్డర్ మిస్టరీ : గొంతు కోసి.. ఇంటర్ విద్యార్థిని దారుణ హత్య

కరీంనగర్ జిల్లా విద్యానగర్ లో దారుణం జరిగింది. ఓ ఇంటర్ విద్యార్థిని దారుణ హత్యకు గురైంది. మృతురాలిని రాధికగా గుర్తించారు. సోమవారం(ఫిబ్రవరి 10,2020) సాయంత్రం రాధిక

కరీంనగర్ జిల్లా విద్యానగర్ లో దారుణం జరిగింది. ఓ ఇంటర్ విద్యార్థిని దారుణ హత్యకు గురైంది. మృతురాలిని రాధికగా గుర్తించారు. సోమవారం(ఫిబ్రవరి 10,2020) సాయంత్రం రాధిక గొంతు కోసి చంపేశారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో దుండగుడు రాధిక గొంతుకోసి కిరాతకంగా చంపాడు. రక్తపు మడుగులో రాధిక మృతదేహం ఉంది. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు.

ఎవరు హత్య చేశారు? ఎందుకు చంపారు? అనే వివరాలు తెలుసుకునే పనిలో పోలీసులు ఉన్నారు. ఈ మర్డర్ మిస్టరీగా మారింది. త్వరలోనే మిస్టరీని చేధిస్తామన్నారు. కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అయితే తమకు ఎవరూ శత్రువులు లేరని, ఇది ఎలా జరిగిందో తమకు తెలియదని, ఎవరిపైనా అనుమానాలు లేవని కుటుంబసభ్యులు చెప్పారు. రాధిక హత్యకు ప్రేమ వ్యవహారం కారణమా? అనే కోణంలో పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు.

రాధిక కుటుంబసభ్యులను, ఫ్రెండ్స్ ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. అన్ని కోణాల్లో దర్యాఫ్తు చేస్తున్నారు. రాధిక తల్లిదండ్రులు కూలి పని చేస్తారు. ఎప్పటిలాగే సోమవారం కూడా కూలి పనులకు వెళ్లారు. ఇంటికి తిరిగి వచ్చేసరికి దారుణం జరిగిపోయిందన్నారు. రాధిక హత్య విషయం తెలుసుకుని షాక్ కు గురయ్యారు. పోలీసులు సీసీ కెమెరాలను నిశితంగా పరిశీలిస్తున్నారు. అందులో ఏమైనా క్లూ లభిస్తుందేమోనని ఆశిస్తున్నారు. కాగా, మృతురాలు రాధిక సహస్ర జూనియర్ కాలేజీలో ఫస్టియర్ చదువుతోంది. రాధిక మర్డర్ వెనుక అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. స్పాట్ లో పోలీసులకు ఒక్క ఆధారం కూడా కనిపించలేదు. దీంతో వారు కూడా ఏమీ చెప్పలేకపోతున్నారు. అన్ని కోణాల్లో ఎంక్వైరీ చేస్తున్నామని, త్వరలోనే మర్డర్ మిస్టరీని చేధిస్తామని పోలీసులు తెలిపారు.