విషాదం : ఇంటర్ విద్యార్ధిని ఆత్మహత్య
హైదరాబాద్ : రాయదుర్గం పోలీసు స్టేషన్ పరిధి చిత్రపురికాలనీలో విషాదం చోటు చేసుకున్నది. ఇంటర్ మొదటి సంవత్సరం చదివిన హిందూశ్రీ అనే 18 సంవత్సరాల విద్యార్ధిని ఆత్మహత్యకు పాల్పడింది. LIG అపార్ట్మెంట్లోని నాలుగో అంతస్తు నుంచి దూకి శనివారం ఆత్మహత్య చేసుకుంది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. విద్యార్థిని ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
Read Also : ఇదేనా అభివృద్ధి : జంతువులు త్రాగే నీళ్లను త్రాగుతున్నారు