జమ్మూ కాశ్మీర్ లో ఎన్ కౌంటర్…ఇద్దరు ఉగ్రవాదులు మృతి

  • Published By: chvmurthy ,Published On : May 12, 2019 / 03:05 AM IST
జమ్మూ కాశ్మీర్ లో ఎన్ కౌంటర్…ఇద్దరు ఉగ్రవాదులు మృతి

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌లోని షోపియాన్ జిల్లా లో ఆదివారం తెల్లవారు ఝూమున ఎన్ కౌంటర్ జరిగింది.  హింద్‌ సీతా పొర ప్రాంతంలో  జరగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు. ఈ ప్రాంతంలోని ఓ ఇంట్లో ఉగ్రవాదులు దాక్కుని ఉన్నారనిసమాచారం  తెలుసుకున్న  సీఆర్పీఎఫ్ దళాలు , కాశ్మీర్ పోలీసులు  ఉగ్రవాదులు ఉన్న ప్రాంతంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు.   ఈ సమయంలో ఉగ్రవాదులు కాల్పులు   సైనిక దళాలపై  కాల్పులు ప్రారంభించగా.. సైనిక దళాలు ఎదురుదాడి చేశాయి. సైన్యం జరిపిన కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు. సంఘటనాస్థలం నుంచి భారీగా పేలుడు పదార్థాలు, ఆయుధాలు లభ్యం చేసుకున్నారు. మరి కొంతమంది ఉగ్రవాదులు అదే ప్రాంతంలో  దాగి ఉండటంతో ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి.