50 ఏళ్ల వితంతువుపై సామూహిక అత్యాచారం చేసిన యువకులు

50 ఏళ్ల వితంతువుపై సామూహిక అత్యాచారం చేసిన యువకులు

3 men gangrape 50 year old widow in Chatra, brutally injure her private parts : ఢిల్లీలోని నిర్భయ గ్యాంగ్ రేప్ కేసును గుర్తు చేసే ఘోరమైన సంఘటన జార్ఖండ్ లోని కొబ్నాగ్రామంలో జరిగింది. 50 ఏళ్ల వితంతువుపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె ప్రతిఘటించటంతో ఆమె మర్మాంగాల్లో స్టీల్ గ్లాస్ పెట్టారు. తీవ్ర గాయాలపాలైన మహిళ ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతోంది.

జార్ఖండ్ రాష్ట్రం, చత్రా జిల్లా, లోని హంటర్ గంజ్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో 50 ఏళ్ల వితంతువు తన కుటుంబ సభ్యులతో జీవిస్తోంది. గురువారం రాత్రి సుమారు 10 గంటల సమయంలో బహిర్భూమికి వెళ్ళటానికి ఆమె తన ఇంటికి కొంత దూరంలోని బహిరంగ ప్రదేశానికి వచ్చింది. ఆ సమయంలో అక్కడ ఉన్నముగ్గురు యువకులు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె వారినుంచి తప్పించుకునేందుకు తీవ్రంగా ప్రతిఘటించింది. దీంతో వారు ఆమె ప్రైవేట్ భాగాల్లో స్టీలు గ్లాసు పెట్టి ఆమెను హింసించారు. ఈ విషయం ఎవరికైనా చెపితే చంపేస్తామని బెదిరించి అక్కడి నుంచి పారిపోయారు.

బహిర్భూమికి వెళ్లిన మహిళ ఎంత సేపటికి రాక పోయేసరికి కుటుంబ సభ్యులు ఆమెకోసం గాలించారు. తీవ్ర గాయాలతో ఉన్న ఆమెను బహిరంగ ప్రదేశంలో గుర్తించారు. వెంటనే ఆమెను సమీపంలోని హంటర్ గంజ్ ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ ఆమెకు ప్రాధమిక చికిత్స చేసి మెరుగైన చికిత్స కోసం బీహార్, గయలోని అనుగ్రా నారాయణ్ మగధ్ మెడికల్ కాలేజీకి తరలించారు. అక్కడ ఆమె మృత్యువుతో పోరాడుతోంది. కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. మరోక వ్యక్తి పరారీలో ఉన్నాడు.