పొట్టి మహిళ ఇంట్లో దొంగతనం

  • Published By: madhu ,Published On : November 21, 2019 / 05:57 AM IST
పొట్టి మహిళ ఇంట్లో దొంగతనం

ప్రపంచంలోనే అతిపొట్టి మహిళగా పేరొందిన జ్యోతి ఆమ్జే ఇంట్లో దొంగలు పడ్డారు. బంగారం, నగదు కలిపి మొత్తం రూ. 60 వేల సొత్తును అపహరించారు. ఈ మేరకు పోలీసులకు ఆమె కంప్లయింట్ చేసింది. నాగ్ పూర్ నందన్ వన్ ప్రాంతంలో ఈమె నివాసం ఉంటున్నారు. అమెరికాలో ఓ ఫంక్షన్‌ అటెండ్ అయ్యేందుకు తల్లిదండ్రులతో కలిసి ఆమ్జే వెళ్లారు. 2019, నవంబర్ 19వ తేదీ మంగళవారం తిరిగి ఇంటికి బయలుదేరారు. తెల్లవారుజామున డా.బాబా సాహెబ్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో దిగిన వీరిని తీసుకొచ్చేందుకు సోదరుడు సతీష్ ఆమ్జే, అతని సతీమణి కలిసి వెళ్లారు.

ఇంటికి తాళం వేసి విమనాశ్రాయానికి బయలుదేరారు. తిరిగి ఇంటికి చేరుకోగా..తాళం పగులగొట్టబడి ఉండడం..అల్మారాలో వస్తువులు చిందరవందరగా ఉండడంతో దొంగతనం జరిగిందని గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. గుర్తు తెలియని దుండగులు ఇంటి తాళం పగులగొట్టి అల్మారాలో ఉన్న మూడు బంగారు ఉంగరాలు, రూ. 15 వేల క్యాష్, మొత్తంగా రూ. 60 వేల సొత్తును దొంగిలించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమీపంలోని సీసీ టీవీ ఫుటేజ్‌లను పోలీసులు పరిశీలిస్తున్నారు. 

జ్యోతి ఆమ్జే విషయానికి వస్తే…ప్రపంచంలోనే అతి పొట్టి మహిళగా పేరొందారు. ఈమె 62.8 సెంటిమీట్లరు ఎత్తు ఉంటుంది. గిన్నీస్ బుక్ రికార్డ్స్‌లోకి ఎక్కింది. బిగ్ బాస్ 6లో కూడా పాల్గొంది. 
Read More : మహా క్లైమాక్స్ : రోటేషన్ పద్ధతుల్లో ముఖ్యమంత్రుల పాలన