ఇష్టం లేని పెళ్లి చేసుకున్నాడని…మూడ్నేల్లకే అల్లుడ్ని చంపిన అత్తింటి వారు

ఇష్టం లేని పెళ్లి చేసుకున్నాడని…మూడ్నేల్లకే అల్లుడ్ని చంపిన అత్తింటి వారు

27 years man killed by father-in-law over marriage in palakkad : సొసైటీలో తమ కంటే తక్కువ స్ధాయి కల వ్యక్తిని పెళ్ళాడినందుకు అల్లుడిని పెళ్లైన మూడునెలలకే తుదముట్టించారు అత్తింటివారు. కేరళలోని పాలక్కాడ్ జిల్లాలో ఈఘోరం జరిగింది.
కేరళలోని పాలక్కాడ్ జిల్లాలోని తెన్కరిస్సి లో నివసించే అనీష్(27) ఆ ప్రాంతంలో అత్యంత ధనిక కుటుంబానికి చెందిన యువతితో ప్రేమలో పడ్డాడు.

కొన్నాళ్లకు  వారిద్దరి ప్రేమ విషయం ఆ యువతి ఇంట్లో తెలిసిపోయింది. ఇంట్లో వారు అభ్యంతరం చెప్పారు. యువతిని కట్టడి చేశారు. అయినా ప్రేమికులిద్దరూ కుటుంబ సభ్యులను ఎదిరించి మూడు నెలల క్రితం వివాహం చేసుకుని కాపురం పెట్టారు. దీంతో రెండు కుటుంబాల మధ్య గొడవ మరింత పెరిగింది. ఈ క్రమంలో అమ్మాయి కుటుంబ సభ్యులు అనీష్ ను, అతడి కుటుంబ సభ్యులను బెదిరించసాగారు.

ఈ వ్యవహారంలో పోలీసులు జోక్యం చేసుకోవటంతో అమ్మాయి కుటుంబ సభ్యులు రాజీకి వచ్చారు. ఇలా ఉండగా శుక్రవారం…. డిసెంబర్ 25వ తేదీ సాయంత్రం అనీష్ తన సోదరుడితో కలిసి ఆఫీసు నుంచి బైక్ పై ,  ఇంటికి తిరిగి వస్తుండగా అమ్మాయి తండ్రి, ఆమె మేనమామ దారి కాచి అనీష్ ను కత్తులతో దారుణంగా పొడిచి చంపారు.

తీవ్ర గాయాలపాలైన అనీష్ ను అతడి సోదరుడు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలోనే కన్ను మూశాడు. అనీష్ తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు యువతి తండ్రి ప్రభు కుమార్, ఆమె మేనమామ సురేష్ లను అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.