Illicit Affair : విడాకుల కోసం కోర్టుకెక్కిన భార్యభర్తలు… భార్య ప్రియుడి మర్మాంగంపై భర్త కాల్పులు

వాళ్లిద్దరికి పెళ్లై 18 ఏళ్లు అయ్యింది. ఇన్నేళ్ల   కాపురంలో ఎటువంటి చీకు చింతా లేకుండా హ్యాపీగా కాపురం చేసారు.  ఇంతలో ఏమైందో ఏమో వారి కాపురంలో కలతలు వచ్చాయి.  భార్యా భర్తలిద్దరూ విడాకులు కోరుతూ కోర్టుకెక్కారు. 

Illicit Affair : విడాకుల కోసం కోర్టుకెక్కిన భార్యభర్తలు… భార్య ప్రియుడి మర్మాంగంపై భర్త కాల్పులు

Illicet Affair

Illicit Affair : వాళ్లిద్దరికి పెళ్లై 18 ఏళ్లు అయ్యింది. ఇన్నేళ్ల   కాపురంలో ఎటువంటి చీకు చింతా లేకుండా హ్యాపీగా కాపురం చేసారు.  ఇంతలో ఏమైందో ఏమో వారి కాపురంలో కలతలు వచ్చాయి.  భార్యా భర్తలిద్దరూ విడాకులు కోరుతూ కోర్టుకెక్కారు.  కేసు విచారణలో ఉండగానే భార్య ఇంకొక వ్యక్తితో సన్నిహితంగా ఉండసాగింది. అది తట్టుకోలేని భర్త , భార్య ప్రియుడి  మర్మాంగంపై కాల్పులు జరిపిన ఘటన కేరళలో చోటు చేసుకుంది.

కేరళలోని కొట్టాయం జిల్లాకు చెందిన నరేష్ కుమార్(46) భార్య పూర్ణిమ (40) లు   పెళ్లైన 18 ఏళ్ల తర్వాత కాపురంలో కలతలు వచ్చి విడాకుల కోసం కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. మధ్యవర్తుల ద్వారా రాజీ కోసం ఎంత ప్రయత్నాలు చేసినా వారిద్దరూ కలిసి జీవించటానికి  ససేమిరా అన్నారు.

కోర్టులో కేసు విచారణ జరుగుతోంది. భార్యా,భర్తలిద్దరూ విడివిడిగా జీవించ సాగారు.  ఈలోగా భార్య .. ప్రదీప్ (45) అనే వ్యక్తితో ప్రేమలో పడింది. భార్య నుంచి విడాకులు రాకపోవటంతో నరేష్ భార్యమీద ఒక కన్ను వేసి ఉంచాడు. భార్య ప్రదీప్ తో   ప్రేమలో పడిన సంగతి తెలుసుకున్నాడు.

పూర్ణిమ  అలప్పుజ జిల్లాలోని ముండనకవి ప్రాంతంలో ఇల్లు తీసుకుని జీవించసాగింది.  పూర్ణిమ ఒంటరిగా ఉండటంతో ఆమె ప్రియుడు  ప్రదీప్ ఎక్కువ సమయం ఆమె  దగ్గరే గడుపుతూ ఉండేవాడు. ఈసమాచారం తెలుసుకన్న నరేష్ కోపంత ఉగిపోయాడు. భార్యను ప్రవర్తన మార్చుకోమని హెచ్చరించాడు.  ఆమె అతడి మాటలు లెక్కచేయలేదు.

నీకు నాకు సంబందం ఏమిటీ…ఇద్దరం కోర్టులో విడాకులకు అప్లై చేశాము. నీ పని నువ్వు చూసుకోమంటూ సమాధానం చెప్పింది. భార్య చెప్పిన మాటలకు మరింత కోపంతో రగిలిపోయాడు నరేష్.  విడాకుల కేసు పెండింగ్ లో  ఉన్నా భర్త తనను కట్టడి చేయాలని చూడటం ఆమెకు నచ్చలేదు.  దీనితో ఆమె ప్రదీప్ తో మరింత విచ్చలవిడిగా తిరగసాగింది.

ప్రదీప్ బైక్ పై,  కారులో షికార్లు చేయసాగింది. ప్రదీప్  దాదాపు పూర్ణిమ ఇంట్లోనే ఉండసాగాడు. వీళ్ల ప్రేమాయణం చాలాకాలం ఓపిక పట్టి   చూసిన నరేష్ గత శనివారం ఆగస్ట్ ఒకటో తేదీన కోపంతో రగిలిపోయాడు. తన దగ్గర ఉన్న ఎయిర్ గన్ తీసుకుని పూర్ణిమ ఇంటికి వెళ్లాడు.

అక్కడ ఉన్న ప్రదీప్ మర్మాంగాలపై గురి పెట్టి కాల్చాడు. సున్నిత భాగాలు కాల్పులతో గాయ పడటంతో ప్రదీప్ గిలగల లాడిపోయాడు. నరేష్ కు ఇంకా కోపం తగ్గక పోవటంతో మరో రౌండ్ మర్మాంగాలపై కాల్పులు జరిపాడు. వెంటేన పూర్ణిమ అతడ్ని తిరువళ్ల లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకు వెళ్లింది.

వైద్యులు చికిత్స చేసి ఇంటికి పంపించారు. కాగా ఆస్పత్రి అధికారులు ఈవిషయాన్ని సోమవారం పోలీసులకు తెలియచేశారు. కానీ బాధితుల్లో ఎవ్వరూ లిఖితపూర్వకంగాఫిర్యాదు చేయక పోవటంతో ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేయలేదు.