మరో దారుణం : పని ఉందని ల్యాబ్ కు పిలిపించి.. విద్యార్థినిపై ప్రొఫెసర్ అత్యాచారం

మేడ్చల్ లోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో దారుణం జరిగింది. విద్యార్థినిపై ల్యాబ్ ఇంచార్జ్ అత్యాచారానికి పాల్పడ్డాడు. బీటెక్ సెకండియర్ చదువుతున్న విద్యార్థినిని.. పని ఉందని

  • Published By: veegamteam ,Published On : December 25, 2019 / 07:43 AM IST
మరో దారుణం : పని ఉందని ల్యాబ్ కు పిలిపించి.. విద్యార్థినిపై ప్రొఫెసర్ అత్యాచారం

మేడ్చల్ లోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో దారుణం జరిగింది. విద్యార్థినిపై ల్యాబ్ ఇంచార్జ్ అత్యాచారానికి పాల్పడ్డాడు. బీటెక్ సెకండియర్ చదువుతున్న విద్యార్థినిని.. పని ఉందని

మేడ్చల్ లోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో దారుణం జరిగింది. విద్యార్థినిపై ల్యాబ్ ఇంచార్జ్ అత్యాచారానికి పాల్పడ్డాడు. బీటెక్ సెకండియర్ చదువుతున్న విద్యార్థినిని.. పని ఉందని కాలేజీలోని ల్యాబ్ కు పిలిపించాడు ల్యాబ్ ఇంచార్జ్ వెంకటయ్య . ఆ తర్వాత తలుపు మూసి అత్యాచారానికి పాల్పడ్డాడు. విద్యార్ధిని పోలీసులను ఆశ్రయించడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు.

పేట్‌బషీరాబాద్ పోలీసుల కథనం ప్రకారం.. నల్గొండ జిల్లా నిడమనూరు మండలం ఎర్రవల్లికి చెందిన మల్లకంటి వెంకటయ్య తార్నాకలో నివాసం ఉంటున్నాడు. మైసమ్మగూడలోని ప్రైవేట్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నాడు. అదే సమయంలో ల్యాబ్ ఇంచార్జ్‌గానూ వ్యవహరిస్తున్నాడు.

సోమవారం(డిసెంబర్ 23,2019) సాయంత్రం ఎక్స్ పరిమెంట్ కోసం అంటూ విద్యార్థినిని ల్యాబ్‌కు పిలిపించాడు వెంకటయ్య. ఆ తర్వాత తలుపులు మూసి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అదే రోజు బాధితురాలు తనపై జరిగిన దారుణం గురించి కుటుంబ సభ్యులకు చెప్పింది. వారు నిన్న(డిసెంబర్ 24,2019) పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెంకటయ్యను అదుపులోకి తీసుకున్నారు. వైద్య పరీక్షల నిమిత్తం బాధిత విద్యార్థిని ఆసుపత్రికి తరలించారు.

‘దిశ’లాంటి ఘటనలు దేశాన్ని కుదిపేస్తున్నా.. ఎన్‌కౌంటర్లు జరుగుతున్నా అమ్మాయిలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. కామాంతో కళ్లు మూసుకుపోయిన కొందరు మృగాళ్లలా వ్యవహరిస్తున్నారు. దేశంలో ఏదో ఒక చోట అఘాయిత్యాలు జరుగుతూనే ఉండటంతో.. అమ్మాయిల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. తల్లిదండ్రులు టెన్షన్ పడుతున్నారు. కఠిన చట్టాలు తీసుకురావడమే కాకుండా వెంటనే అమలు చేయాలని అంటున్నారు.