ఉల్లిగడ్డ కోసం తోటి కూలి పై హత్యాయత్నం

ఉల్లిగడ్డ కోసం తోటి కూలి పై హత్యాయత్నం

Labourer stabbed by fellow worker for refusing to give extra onions for salad : రాత్రి డిన్నర్ లో అదనపు ఉల్లిపాయలు ఇవ్వలేదనే కోపంతో తోటి కూలిపై కత్తితో విచక్షణా రహితంగా దాడి చేశాడు మరొక కూలీ. దక్షిణ ఢిల్లీలోని ఫతేపూర్ బేరి వద్ద డిసెంబర్ 8న ఈదారుణం జరగింది. రియాసత్ అలీ(59) పవన్(60) అనే ఇద్దరు వ్యక్తులు కూలి పనుల కోసం ఫతేపూర్ బేరి వద్ద ఉన్న ఎస్బీ ఫామ్ లో చేరారు.

డిసెంబర్ 8వ తేదీ రాత్రి పని పూర్తయిన తర్వాత రాత్రిభోజనం చేయాటానికి రెడీ అయ్యారు. అయితే వారికి భోజనంలో సలాడ్ ఇచ్చారు. సలాడ్ లో తినేందుకు అదనంగా కొన్ని ఉల్లిపాయలు కావాలాని అలీ, పవన్ ను కోరాడు.

అదనంగా ఇచ్చేందుకు ఉల్లిపాయలు లేవని ఉన్నవాటితోనే తినమని పవన్ చెప్పాడు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో కోపం పట్టలేని అలీ …. కిచెన్ లో ఉండే కత్తితో పవన్ పై విచక్షణా రహింతాగా దాడి చేసి పారిపోయాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్ధలానికి చేరుకుని బాధితుడ్ని ఎయిమ్స్ ట్రామా సెంటర్ కి తరలించారు. ప్రస్తుతం పవన్ ప్రాణాపాయం నుంచి బయట పడ్డాడని వైద్యులు తెలిపారు.

సీసీ టీవీ ఫుటేజి ఆధారంగా అలీని పట్టుకోటానికి పోలీసులు విస్తృతంగా గాలించారు. సమారు 500 మంది కూలీలను విచారించారు. చివరికి ఓల్డ్ ఢిల్లీ రైల్వే స్టేషన్ సమీపంలోని లేబర్ క్యాంపు వద్ద పుట్ పాత్ పై పడుకుని ఉండగా అరెస్ట్ చేశారు. హత్యయత్నానికి ఉపయోగించిన మారణాయుధాన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.