Rajasthan : తనకంటే 15 ఏళ్లు చిన్నవాడైన అల్లుడితో అత్త ఎఫైర్, చివరికి…..!

సమాజంలో నీతి నియమాలు, కట్టుబాట్లు అన్నీదూరమై పోతున్నాయి. క్షణికమైన సుఖాల కోసం అడ్డదారులు తొక్కుతున్నారు.

Rajasthan : తనకంటే 15 ఏళ్లు చిన్నవాడైన అల్లుడితో అత్త ఎఫైర్,  చివరికి…..!

Rajasthan Love Affair

Rajasthan :  సమాజంలో నీతి నియమాలు, కట్టుబాట్లు అన్నీదూరమై పోతున్నాయి. క్షణికమైన సుఖాల కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. రాజస్ధాన్ లోని ఒకగ్రామంలో కూతురు నిచ్చి పెళ్లి చేసిన అల్లుడితో ఎఫైర్ పెట్టుకుందో మహిళ. కలిసి జీవించలేక ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటు చేసుకుంది.

పశ్చిమ రాజస్థాన్ లోని బార్మర్ జిల్లాలోని ఖార్టియా గ్రామానికి చెందిన గీత(20)కు కెరవా లో నివాసం ఉంటున్న హోతారం భిల్ (25) తో ఏడాది క్రితం వివాహం అయ్యింది. ఇటీవల హోతారాం తన భార్య గీతను తీసుకుని అత్తగారింటికి వచ్చాడు. ఏమైందో తెలియదు కానీ మంగళవారం ఉదయం ఇంట్లో వాళ్లు లేచి చూసే సరికి ఇంట్లో అత్త, అల్లుడు కనిపించలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఆ పరిసర ప్రాంతాల్లో గాలింపు చేపట్టారు. స్దానిక రూరల్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ఇదిలా ఉండగా….ఈరోజు ఉదయం ఊరికి 30 కిలోమీటర్ల దూరంలోని బార్మర్-మునబోవా రహదారి గుండా వెళుతున్న వాహన దారులు అక్కడ చెట్టుకు వేలాడుతున్న రెండు మృత దేహాలను గుర్తించారు. వెంటనే వారు సమీపంలోని రూరల్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు, గ్రామస్తులు అక్కడకు చేరుకున్నారు.

చనిపోయిన వారిని సోమవారం రాత్రి కనిపించకుండా పోయిన హోతారం భిల్,అతని అత్త దరియా(38) గా గుర్తించారు. పోలీసులు ఈ సమాచారం కుటుంబ సభ్యులకు తెలియచేశారు. వారు వచ్చి మృతదేహాలను గుర్తించారు. పోలీసులు మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా ..ఆత్మహత్య చేసుకున్న అత్త, అల్లుడు మధ్య వివాహేతర సంబంధం ఉందని ప్రాధమిక సమాచారం వల్ల తెలుస్తోందని కేసు విచారణలో మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు అన్నారు.

Also Read : State Bank Of India : ఎస్‌బీ‌ఐలో నగదు అవకతవకలు- రూ.5 కోట్లు కాజేసిన క్యాషియర్