ప్రేమిస్తే చావేనా : రైలు కింద పడి ప్రేమజంట ఆత్మహత్య

రంగారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. రైలు కింద పడి ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. శంషాబాద్ మండలం పిల్లోనిగూడ దగ్గర ఈ ఘటన జరిగింది. మృతులను రంగారెడ్డి

  • Published By: veegamteam ,Published On : March 31, 2019 / 05:32 AM IST
ప్రేమిస్తే చావేనా : రైలు కింద పడి ప్రేమజంట ఆత్మహత్య

రంగారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. రైలు కింద పడి ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. శంషాబాద్ మండలం పిల్లోనిగూడ దగ్గర ఈ ఘటన జరిగింది. మృతులను రంగారెడ్డి

రంగారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. రైలు కింద పడి ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. శంషాబాద్ మండలం పిల్లోనిగూడ దగ్గర ఈ ఘటన జరిగింది. మృతులను రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం పిట్టగూడ వాసులుగా గుర్తించారు. ఆదివారం(మార్చి 31, 2019) తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది.

రైల్వే ట్రాక్ పై స్థానికులు 2 మృతదేహాలను గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు. మృతుల దగ్గరున్న ఎవిడెన్స్ ఆధారంగా వారు రంగారెడ్డి జిల్లా పిట్టగూడకు చెందినవారిగా గుర్తించారు.
Read Also : ‘నాసా’ బంపర్ ఆఫర్ : ‘నిద్ర’ ప్రియులకు లక్షలిస్తాం

తమ ప్రేమకు పెద్దలు అంగీకారం తెలపడం లేదన్న క్షణికావేశంలోనే వారు ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. ఈ ఘటన ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం పిట్టలగూడేనికి చెందిన శ్రవణ్‌, మహేశ్వరం మండలం కల్వకోల్‌ గ్రామానికి చెందిన మయూరి కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. శ్రవణ్‌ డిగ్రీ చదువుతుండగా, మయూరి ఇంటర్‌ చదువుతోంది. వీరు తమ ప్రేమ విషయాన్ని ఇంట్లో పెద్దలకు చెబితే.. వారు ససేమిరా అన్నారు.

దీంతో మనస్తాపానికి గురైన ఇద్దరూ చనిపోవాలని నిర్ణయానికి వచ్చారు. శంషాబాద్‌ మండలం పిల్లోనిగూడ సమీపంలో ఆదివారం తెల్లవారుజామున రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు చెప్పారు.
Read Also : కేజ్రీవాల్ కు బాబు రూ.50 కోట్లిచారట: ఇదో లెక్కా అంటున్న వైసీపీ