ప్రేమజంట ఆత్మహత్యాయత్నం : యువతి మృతి

విశాఖ జిల్లాలోని మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రేమజంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. యువతి మృతి చెందింది.

  • Published By: veegamteam ,Published On : January 23, 2019 / 02:15 PM IST
ప్రేమజంట ఆత్మహత్యాయత్నం : యువతి మృతి

విశాఖ జిల్లాలోని మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రేమజంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. యువతి మృతి చెందింది.

విశాఖ : జిల్లాలోని మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రేమజంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. యువతి మృతి చెందగా, యువకుడు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు.  

జై ఆంధ్ర కాలనీకి చెందిన దేవి డిగ్రీ ఫైనల్ ఇయర్ చదుతోంది. భాను ప్రసాద్ ఐటీఐ చేసి కూలీ పనులు చేస్తున్నాడు. ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. అయితే ఇటీవల దేవికి వేరే వ్యక్తితో పెద్దలు నిశ్చితార్థం చేశారు. పెద్దలను ఎదురించలేక, ఇష్టం లేని పెళ్లి చేసుకోలేక ఇద్దరూ చనిపోవాలని నిర్ణయించుకున్నారు. దేవి, భాను ప్రసాద్ వేర్వేరు చోట్ల ఉరివేసుకున్నారు. దేవి మృతి చెందింది. భాను ప్రశాంత్ ను స్థానికులు కాపాడటంతో ప్రాణాలతో భయటపడ్డాడు. యువతి మృతి ఆమె కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. గ్రామంలో విషాధచాయలు అలుముకున్నాయి.