మొదటి భర్తను పక్కా ప్లాన్ తో చంపిన నాలుగో భార్య
Fourth wife’ set up sex trap : మహారాష్ట్రలోని నాగపూర్ లో దారుణం చోటు చేసుకుంది. తన భర్త సెక్స్ కోరికలను ఆసరాగా చేసుకుని అతని నాలుగో భార్య ..రెచ్చగొట్టి చేతులు కట్టేసి హత్య చేసిన ఉదంతం వెలుగు చూసింది.
నాగపూర్ కు చెందిన లక్ష్మణ్ మాలిక్ (65) అనే వ్యక్తి ఈఎస్ఐసీ ఆస్పత్రిలో పనిచేసేవాడు. 2011 లో అతను వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాడు. డబ్బులకు కొదవలేదు. శృంగార కోరికలు ఎక్కువగా ఉన్న మాలిక్ మొత్తం 5 పెళ్ళిళ్లు చేసుకున్నాడు. నాగపూర్ లో బోటిక్ నడిపే స్వాతి మాలిక్ అలియాస్ స్వాతిశర్మ(30) లక్ష్మణ్ కు పరిచయం అయ్యింది.
ఈ పరిచయం కొద్దిరోజుల్లోనే ప్రేమగా మారింది. స్వాతిని నాలుగో భార్యగా పెళ్లి చేసుకున్నాడు. అనంతరం ఇంకో మహిళను కూడా పెళ్లి చేసుకున్నాడు. లక్ష్మణ్ తన భార్యలను వేర్వేరు అద్దె ఇళ్లలో ఉంచి వారితో కాపురం చేసేవాడు.
అయితే 2018 లో స్వాతి శర్మ బోటిక్ లో పని చేసే ఒక యువతితో పరిచయం పెంచుకున్నాడు. అది గమనించిన స్వాతి ఆపరిచయం మానుకోమని చెప్పింది. అయినా అతను వినకపోవటంతో అతడి నుంచి విడిగా వెళ్ళిపోయి జీవించ సాగింది. ఆ తర్వాత మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది.
స్వాతి మరో వ్యక్తిని పెళ్లి చేసుకున్నప్పటికీ లక్ష్మణ్ పెన్షన్ డబ్బులు డ్రా చేసుకుని వాడుకుంటోంది. ఇది అలుసుగా తీసుకుని తన కోరిక తీర్చమని లక్ష్మణ్ స్వాతిని వేధించసాగాడు. లక్ష్మణ్ ను అడ్డుతొలగించుకుని ..పెన్షన్ మొత్తం తానే అనుభవించాలనుకుంది. అతడి సెక్స్ కోరికలే ఆయుధంగా అతడ్ని మట్టుపెట్టాలని ప్లాన్ వేసింది.
మార్చి8న మాలిక్ కు ఫోన్ చేసింది. సరే ఇన్నాళ్లనుంచి అడుగుతున్నావు కనుక నీ కోరిక తీరుస్తాను అని చెప్పి అతని అద్దె ఇంటికి వెళ్లింది. అక్కడు ఈ సారి కొత్తగా ట్రై చేద్దాం ఎప్పడూ ఒకేలా ఏంటి అని తన స్మార్ట్ ఫోన్ ఓపెన్ చేసి యూట్యూబ్ లోని కొన్ని పోర్న్ వీడియాలను చూపించి రెచ్చగొట్టింది.
ఆవీడియోలో ఉన్న వెరైటీ భంగిమ ట్రై చేద్దామని కోరింది. మాలిక్ కూడా అందుకు ఒప్పుకుని చాలా ఎగ్జైట్ ఫీల్ అయ్యాడు. స్వాతి చెప్పినట్లు చేశాడు. ముందుగా ప్లాన్ చేసుకున్న ప్రకారం లక్ష్మణ్ మాలిక్ ను, స్వాతి ఒక కూర్చీలో కూర్చోబెట్టింది. తనతోపాటు తెచ్చుకున్న నైలాన్ తాడుతో అతడి చేతులు రెండు వెనక్కి విరిచ్చి కట్టేసింది. కాళ్లు రెండు కదలకుండా కట్టింది.
స్వాతి ఏం చేయబోతోందో అర్ధంకాని లక్ష్మణ్ ఆమె చేసే పనులకు నోరు మెదపకుండా కూర్చున్నాడు. అతడ్ని కట్టేసిన తర్వాత తన బ్యాగులోంచి కత్తి తీసి కసితీరా పొడిచింది. ఆ కత్తిపోట్లకు లక్ష్మణ్ అక్కడికక్కడే చనిపోయాడు. అతడు చనిపోయాడని నిర్ధారించుకున్నతర్వాత ఎవరికీ అనుమానం రాకుండా అక్కడినుంచి వెళ్లిపోయింది.
ఆ తర్వాత ఇంటికి వచ్చిన కుటుంబ సభ్యులు కాళ్లు చేతులు కట్టిపడేసి, రక్తపు మడుగులో నిర్జీవంగా పడివున్న లక్ష్మణ్ ను చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్ధలానికి వచ్చిన పోలీసులు మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
దాదాపు 180 మందిని విచారించారు. ఎక్కడా ఎలాంటి క్లూ లభించలేదు. అతని5 గురు భార్యలను విచారించారు. స్వాతి చెప్పిన పొంతనలేని సమాధానాలతో పోలీసులకు అనుమానం కలిగింది. స్వాతిని పలుమార్లు ప్రశ్నించిన పోలీసులు చివరికి తమదైన స్టైల్లో విచారించే సరికి నేరం ఒప్పుకుంది.
స్వాతి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకున్నప్పటికీ లక్ష్మణ్ నుంచి అధికారికంగా విడాకులు తీసుకుని విడిపోలేదు. దీంతో లక్ష్మణ్ ను తాను హత్యచేస్తానని ఎవరూ భావించరు. ఎవరికీ తన మీద అనుమానం రాదు అనుకుంది.
పైగా వారిద్దరూ చాలా రోజల తర్వాత రహస్యంగా కలుసుకున్నారు. కనుక హత్య తనపై రాదు అని భావించి తన కసి తీర్చుకుంది. కాగా …2016లో లక్ష్మణ్ రెండో భార్య,తన స్నేహితురాలితో కలిసి తనను కుర్చీలో కట్టిపడేసి కొట్టారని స్వాతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇప్పడు లక్ష్మణ్ ను అదే రీతిలో హత్యచేసింది.