స్వీట్ కోసం రూ.5 అడిగిందని చిన్నారిని చంపిన తండ్రి

స్వీట్ కోసం రూ.5 అడిగిందని చిన్నారిని చంపిన తండ్రి

Maharashtra : Man kills crying daughter in Gondia, after Wife asks for Rs 5 to buy snacks for 20-month-old daughter :  అత్తమీద కోపం దుత్త మీద చూపించారన్నట్లు.. భార్యమీద కోపంతో కన్నకూతుర్ని నేలకోసి కొట్టి చంపిన ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. మహారాష్ట్రలోని గోండియా జిల్లా, లోనరా గ్రామానికి చెందిన వివేక్, వర్ష దంపతులకు 20 నెలల వైష్ణవి అనే ఆడపిల్ల ఉంది, ఫిబ్రవరి 2వ తేదీన సాయంత్రం ఇంటికి వచ్చిన వివేక్ తో…కూతురు స్వీట్ కొనుక్కోవాలంటోంది ఐదు రూపాయలు ఇవ్వమని వర్ష భర్తను అడిగింది.

అయితే నిందితుడు తన వద్ద చిల్లరలేదని…..తనను విసిగించవద్దని భార్యను కోరాడు. దీంతో భార్య భర్తతో గొడవకు దిగింది. ఈ సమయంలో కూతురు వైష్ణవి ఏడవటం మొదలు పెట్టింది, కోపంతో ఊగిపోయిన వివేక్ బాలికను తీసుకుని గోడకేసి బాదాడు. ఈక్రమంలో బాలికకు తీవ్రంగా గాయాలై, రక్తస్రానవమయ్యింది.

రక్తసావ్రమైన చిన్నారిని తల్లి ఆస్పత్రికి తీసుకువెళ్లగా అప్పటికే చిన్నారి మరణించినట్లు వైద్యులు తెలిపారు. వర్ష ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. వివేక్ ను అరెస్ట్ చేశారు. కాగా… గతకొన్నేళ్ళుగా భార్యా భర్తల మద్య సఖ్యత లోపించినట్లు పోలీసులు గుర్తించారు.

2018లో వీరు వివాహం చేసుకోగా వివేక్ వేధింపులు తట్టుకోలేక వర్ష మధ్యలో కొన్నాళ్ళు పుట్టింటికి వెళ్లిపోయింది, ఏడాది కాలం పాటు అక్కడే ఉండి ఇటీవలే భర్త వద్దకు వచ్చిందిని స్ధానికులు తెలిపారు. అప్పడప్పుడూ భార్యా భర్తల మధ్య గొడవలు జరుగుతున్నట్లు పోలీసులు విచారణలో తేలింది.