యువతిపై కత్తితో దాడి చేసిన ప్రేమోన్మాది

పశ్చిమగోదావరి జిల్లా పోడూరు మండలం కవిటంలో దారుణం జరిగింది. ప్రేమోన్మాది యువతిపై కత్తితో దాడి చేశాడు.

  • Published By: veegamteam ,Published On : October 16, 2019 / 06:23 AM IST
యువతిపై కత్తితో దాడి చేసిన ప్రేమోన్మాది

పశ్చిమగోదావరి జిల్లా పోడూరు మండలం కవిటంలో దారుణం జరిగింది. ప్రేమోన్మాది యువతిపై కత్తితో దాడి చేశాడు.

పశ్చిమగోదావరి జిల్లా పోడూరు మండలం కవిటంలో దారుణం జరిగింది. ప్రేమోన్మాది యువతిపై కత్తితో దాడి చేశాడు. అనంతరం విషం తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ఇద్దరిని చికిత్స కోసం పాలకొల్లు ఆస్పత్రికి తరలించారు. వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

సుధాకర్ రెడ్డి అనే వ్యక్తికి గతంలో పెళ్లి కాగా భార్యకు విడాకులు ఇచ్చాడు. కొంతకాలంగా ప్రేమ పేరుతో తేజస్విని అనే యువతిని వేధిస్తున్నాడు. వివాహం చేసుకుంటానని నిత్యం ఆమె వెంట పడుతున్నాడు. అందుకు ఆమె నిరాకరించడంతో కోపం పెంచుకున్న సుధాకర్ మాటు వేసి బుధవారం (అక్టోబర్ 16, 2019) యువతి కాలేజీకి వెళ్తుండగా బస్టాప్ లో ఆమెపై కత్తితో దాడి చేశాడు. దీంతో తీవ్రగాయాలతో రక్తపు మడుగులో పడింది. దాడి చేసిన అనంతరం అతను పురుగుల మంద తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు.