మియాపూర్ లో దారుణం : భార్య తెల్లగా లేదని చంపేశాడు..ఆ తర్వాత

  • Published By: madhu ,Published On : August 19, 2020 / 01:48 PM IST
మియాపూర్ లో దారుణం : భార్య తెల్లగా లేదని చంపేశాడు..ఆ తర్వాత

పెళ్లి చేసుకున్నాడు. కాపురం చేశాడు. తీరా..కొద్ది నెలల తర్వాత..భార్య తెల్లగా, అందంగా లేదని చీదరించుకున్నాడు. పెళ్లి అయి..ఆరు నెలలే..గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు. అనంతరం తాను ఆత్మహత్య చేసుకోబోయాడు. చివరకు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ దారుణ ఘటన మియాపూర్ లో చోటు చేసుకుంది.



అనంతపురం జిల్లాకు చెందిన యోగి..అరుణను ఆరు నెలల క్రితం వివాహం చేసుకున్నాడు. వీరు మియాపూర్ లో నివాసం ఉంటున్నారు. కానీ..అరుణ అందంగా లేదని, తెల్లగా లేదని యోగి అనుకుంటున్నాడు. ఓ సంబంధం విఫలమైన తర్వాత..కుటుంబసభ్యుల వత్తిడి మేరకు అరుణను వివాహం చేసుకున్నాడని పోలీసులు వెల్లడించారు.



మంగళవారం దంపతుల మధ్య గొడవ జరిగింది. ఆవేశంలో..కత్తితో అరుణ గొంతు కోసి చంపేశాడు. అనంతరం ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. రక్తపు మడుగులో ఉన్న..యోగిని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.