14 ఏళ్ల కుమార్తె పెళ్లికి నో చెెప్పిందని భార్యను హత్య చేసిన భర్త

  • Published By: madhu ,Published On : July 30, 2020 / 08:42 AM IST
14 ఏళ్ల కుమార్తె పెళ్లికి నో  చెెప్పిందని భార్యను హత్య చేసిన భర్త

మానవ సంబంధాలు మంటగలుస్తున్నాయి. 14 ఏళ్ల కుమార్తెను మధ్య వయస్కున్న వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేయాలని భర్త తీసుకున్న నిర్ణయాన్ని భార్య వ్యతిరేకించింది. అంతే..క్షణికావేశంలో ఆమెను చంపేశాడు. ఈ దారుణ ఘటన Noida లో చోటు చేసుకుంది.

UPలోని నోయిడా 167 సెక్టార్ లోని మంగ్రోలి గ్రామంలోని పొలాల వద్ద మహిళ డెడ్ బాడీ ఉందని స్థానికులు ఇచ్చిన సమాచారంతో..పోలీసులు ఘటన ప్రదేశానికి చేరుకున్నారు. చనిపోయిన మహిళ తారా (43)గా గుర్తించారు. అనంతరం పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

గులాక్ష, తారా దంపతులకు ముగ్గురు పిల్లలుండేవారు. దంపతులు తరచూగా మద్యం సేవించేవారు. 14 ఏళ్ల వయస్సున్న కుమార్తె వివాహం చేయాలని గులాక్ష నిర్ణయం తీసుకున్నాడు. ఓ మధ్య వయస్కుడితో ఈ మేరకు ఒప్పందం చేసుకున్నాడు. అతని దగ్గరి నుంచి మద్యం కొనుక్కొనేందుకు డబ్బులు తీసుకున్నాడు.

ఇదే విషయాన్ని భార్య తారాకు చెప్పాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పరిసర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వారు జోక్యం చేసుకుని సర్దిచెప్పారు. అనంతరం వీరిద్దరూ బయటకు వెళ్లిపోయారు. అనంతరం ఏమి జరిగిందో తమకు తెలియదని పోలీసులకు పిల్లలు చెప్పారు.

Expressway SHO యోగేశ్ కుమార్ మాట్లాడుతూ..భార్య తలపై గాయం ఉందని, గులాక్ష కర్రతో దాడి చేసే అవకాశం ఉందని చెప్పారు. డెడ్ బాడీని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఐపీసీ సెక్షన్ లోని 302 కింద హత్యకు పాల్పడిన గులాక్షపై కేసు నమోదు చేశారు.