గజ్వేల్‌లో దారుణం : నాకు దక్కనిది మరెవరికి దక్కకూడదంటూ యువతిని హత్య చేసిన ప్రేమోన్మాది

సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన న్యాలకంటి లక్ష్మీరాజం, మణెమ్మ దంపతుల కుమార్తె దివ్య. వేములవాడలో వీరు కొన్ని రోజులపాటు ఉన్నారు. ఆ సమయంలో

  • Published By: veegamteam ,Published On : February 19, 2020 / 01:54 AM IST
గజ్వేల్‌లో దారుణం : నాకు దక్కనిది మరెవరికి దక్కకూడదంటూ యువతిని హత్య చేసిన ప్రేమోన్మాది

సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన న్యాలకంటి లక్ష్మీరాజం, మణెమ్మ దంపతుల కుమార్తె దివ్య. వేములవాడలో వీరు కొన్ని రోజులపాటు ఉన్నారు. ఆ సమయంలో

ప్రేమ త్యాగాన్ని కోరుతుందంటారు. కానీ.. ఓ యువకుడి ప్రేమోన్మాదం తాను ప్రేమించిన యువతి ప్రాణాలనే బలికోరింది. ప్రేమోన్మాదిగా మారిన ఓ యువకుడు… మరో వారం రోజుల్లో పెళ్లి పీటలెక్కాల్సిన యువతిని గొంతు కోసి హత్య చేశాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పరాయ్యాడు. 

8వ తరగతి నుంచి వేధింపులు:
సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన న్యాలకంటి లక్ష్మీరాజం, మణెమ్మ దంపతుల కుమార్తె దివ్య. వేములవాడలో వీరు కొన్ని రోజులపాటు ఉన్నారు. ఆ సమయంలో దివ్య అక్కడ 8వ తరగతి చదివింది. ఆ సమయంలోనే క్లాస్‌మేట్‌ అయిన వెంకటేష్‌.. దివ్యను ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు. అతడి బాధ పడలేక వారు ఎల్లారెడ్డిపేటకు వెళ్లారు. వెంకటేశ్‌ గౌడ్‌ అక్కడికి కూడా వెళ్లి దివ్య వెంటపడడంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతణ్ని పోలీస్ స్టేషన్‌కు పిలిపించి మందలించిన పోలీసులు.. మరోసారి ఆమె వెంటపడనంటూ అతడితో కాగితం రాయించుకుని వదిలేశారు. 

ఫిబ్రవరి 26న దివ్య పెళ్లి.. ఇంతలోనే దారుణం:
కొన్నాళ్ల పాటు ఊరుకున్న వెంకటేశ్‌.. మళ్లీ దివ్య వెంట పడడం ఆరంభించాడు. అతడి నుంచి ఎన్ని ఇబ్బందులున్నా ఆమె మాత్రం బాగా చదువుకుంది. 4 నెలల క్రితమే ఏపీజీవీ బ్యాంకు గజ్వేల్‌ శాఖలో ఉద్యోగం సంపాదించింది. దీంతో ఆమె తల్లిదండ్రులు కూడా గజ్వేల్‌కు వచ్చి ఉంటున్నారు. ఇటీవలే దివ్యకు వరంగల్‌కు చెందిన యువకుడితో పెళ్లి కుదిరింది. 26న వివాహం జరగాల్సి ఉంది. ఎప్పటిలాగే మంగళవారం కూడా దివ్య ఆఫీస్‌కు వెళ్లి సాయంత్రం వచ్చింది. మేడపై ఆరేసిన దుస్తులు తీసుకుని కిందికి దిగుతుండగా వెంకటేశ్‌ కత్తితో ఆమెపై దాడి చేశాడు. ఆమె గొంతు కోసి.. శరీరంపై 15 పోట్లు పొడిచి పరారయ్యాడు. ఒక్కసారిగా కుప్పకూలిన దివ్య స్పాట్‌లోనే ప్రాణాలు విడిచింది.

వెంకటేశ్ ను ఉరితీయాలి:
కూతురు దారుణ హత్యకు గురైందని తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు నిర్జీవంగా పడి ఉండడంతో బోరున విలపించారు. తమ కూతురిని దారుణంగా హతమార్చిన నిందితుడు వెంకటేష్‌ గౌడ్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఆధారాలు సేకరించారు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. క్లూస్‌ టీమ్, డాగ్‌ స్క్వాడ్‌తో విచారణ చేశారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు. మరోవైపు దివ్య కుటుంబ సభ్యులను టీఆర్‌ఎస్‌ నేత ఒంటేరు ప్రతాపరెడ్డి పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పారు. వారం రోజుల్లో బంధువులతో కళకళలాడాల్సిన దివ్య ఇంట్లో ఇప్పుడు విషాదం నెలకొంది. తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.