స్నేహితుడి భార్యతో అక్రమ సంబంధం : అడ్డుగా ఉన్నాడని హత్య

స్నేహితుడి భార్యతో అక్రమ సంబంధం : అడ్డుగా ఉన్నాడని హత్య

man killed by friend, due to illegal affair in anantapur district : మానవ సంబంధాలు, విలువలు రానురానూ దిగజారిపోతున్నాయి. ఆనందాలు, ఆప్యాయతలు పోయి.. వాటి స్థానంలో విద్వేషాలు, వైషమ్యాలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా అక్రమ సంబంధాలు పెరిగిపోయి..అవి హత్యలు, ఆత్మహత్యలకు ప్రేరేపిస్తున్నాయి. తాత్కాలిక సుఖాల కోసం, అక్రమ సంబంధం కోసం తాళి కట్టిన భర్తను హత్య చేయించిన భార్య ఉదంతం అనంతపురం జిల్లా గుత్తి ఆర్.ఎస్.లో జరిగింది.

గుత్తి ఆర్.ఎస్.లోని తోళ్ల షాపులో నివాసంఉండే అశోక్, యోగి మంచి స్నేహితులు. ఇద్దరూ పెయింటిగ్ వృత్తిలో ఉన్నారు. అశోక్ అప్పుడప్పుడూ యోగిని తన ఇంటికి కూడా పిలుస్తూ ఉండేవాడు. ఈ క్రమంలో అశోక్ భార్య తో యోగికి వివాహేతర సంబంధం ఏర్పడింది. కొన్నాళ్లకు ఈవిషయం తెలిసిన అశోక్ పద్ధతి మార్చుకోవాలని తన భార్యను హెచ్చరించాడు. అయినా ఆమె తన ప్రవర్తన మార్చుకోలేదు. యోగితో సంబంధం కొనసాగిస్తోంది. అశోక్ ఆమెను హెచ్చరిస్తూనే ఉన్నాడు. దీంతో భర్త తమ బంధానికి అడ్డుగా ఉన్నాడని భావించి, అతడ్ని చంపాలని ప్రియుడికి సూచించింది.

సమయం కోసం వేచి చూసిన యోగి జనవరి3, ఆదివారం రాత్రి మందు పార్టీ పేరుతో అశోక్ ను పిలిచాడు. ఇద్దరూ కలిసి స్ధానిక జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల వద్దకు వెళ్లారు. కిక్కు ఎక్కేదాకా పీకలదాకా మద్యం సేవించారు. మద్యం మత్తులో యోగీ అశోక్ ను కత్తితో పొడిచి చంపాడు. అనంతరం ఇంటికి వెళ్లిపోయాడు.

సోమవారం ఉదయం మృతదేహాన్ని గుర్తించిన స్ధానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్ధలానికి వచ్చిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. హతుడి తల్లి కంప్లయింట్ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.