Illegal Affair : డ్రైవర్ భార్యతో యజమాని అక్రమ సంబంధం… పక్కా స్కెచ్ తో ….
డ్రైవర్ భార్యతో ఆరేళ్లుగా వివాహేతర సంబంధం పెట్టుకున్న యజమాని తమ అక్రమ సంబంధం కొనసాగటానికి డ్రైవర్ను అడ్డు తప్పించుకోవాలనుకున్నాడు. మంచితనంతో మద్యం తాగించి పై లోకాలకు పంపించేశాడు. చేసిన పాపం రెండు నెలల తర్వాత బయటపడి ఇప్పుడు ప్రేయసి, ప్రియులు జైలు జీవితం గడుపుతున్నారు.
Illegal Affair : డ్రైవర్ భార్యతో ఆరేళ్లుగా వివాహేతర సంబంధం పెట్టుకున్న యజమాని తమ అక్రమ సంబంధం కొనసాగటానికి డ్రైవర్ను అడ్డు తప్పించుకోవాలనుకున్నాడు. మంచితనంతో మద్యం తాగించి పై లోకాలకు పంపించేశాడు. చేసిన పాపం రెండు నెలల తర్వాత బయటపడి ఇప్పుడు ప్రేయసి, ప్రియులు జైలు జీవితం గడుపుతున్నారు.
వరంగల్ జిల్లా, ఖానాపురం మండలం, బుధరావు పేటలో రెండు నెలల క్రితం ఆదృశ్యమైన ట్రాక్టర్ డ్రైవర్ మిస్సింగ్ కేసు మిస్టరీ వీడింది. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని యజమానే అతడ్ని హత్య చేయటం స్ధానికంగా కలకలం రేపింది. బుధరావుపేట పరిధిలోని బోడియా తండాలో నివసించే కున్సోతు రవి(35) బుధరావు పేటకు చెందిన దావూద్ వద్ద ట్రాక్టర్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు.
ఈ క్రమంలో రవి భార్య భారతికి, యజమాని దావూద్కి మధ్య ఆరేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగుతోంది. రవి డ్రైవర్ గా పని చేస్తున్న కాలంలో దావూద్, రవి ఇంటికి రాకపోకలు సాగించేవాడు. దీంతో వారిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఉన్నా ఎవరికీ అనుమానం రాలేదు. ఇటీవల రవి, దావూద్ వద్ద పని మానేశాడు. దీంతో దావూద్ భారతిని కలవటానికి వెళ్లటంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
వాళ్లిద్దరూ తరచూ కలుసు కోవాలంటే రవిని అడ్డు తొలగించుకోవటం ఒక్కటే మార్గమని నిర్ణయించుకున్నారు. ఇద్దరూ కలిసి ప్లాన్ వేశారు. ఏప్రిల్ 23వ తేదీన రవితో ఫుల్ బాటిల్ మద్యం తెప్పించుకున్న దావూద్, ఇద్దరూ కలిసి తాగటానికి బుధరావు పేట శివారులోకి వెళ్లారు.
ఇద్దరూ కలిసి శివారులో కూర్చుని మద్యం సేవించారు. మద్యం మత్తులో ఉన్న రవిని, కర్రతో దావూద్ బలంగా కొట్టడంతో అక్కడి కక్కడే మరణించాడు. మృతదేహాన్ని సమీపంలోని బావి వద్దకు తీసుకు వెళ్లి అందులో పడేసి వెళ్లిపోయాడు. భారతికి ఈ విషయం ఫోన్ చేసి చెప్పి… ఏమీ తెలియనట్లు ఇంటికి వెళ్ళిపోయాడు.
మర్నాడు ఉదయం బావి దగ్గరకు వెళ్లేసరికి రవి శవం పైకి తేలుతూ కనిపించింది. రెండు బండ రాళ్లను కట్టి బావిలోకి వేయటంతో శవం నీటిలో మునిగి పోయింది. గడిచిన రెండు నెలలుగా ఇద్దరూ ఏమీ తెలియనట్లే తమ తమ పనులు చేసుకుంటూ బతికేస్తున్నారు.
కాగా….. రెండు నెలల నుంచి కొడుకు ఇంటికి రాకపోవటంతో రవి తల్లి ఈరమ్మ ఈనెల 23న ఖానాపురం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు రవి భార్య భారతిని విచారించే సరికి.. దావూద్ హత్య చేసిన విషయం బయటపడింది.
నిందితులిద్దరినీ అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్కు తరలించారు. రెండు నెలలుగా కనిపించకుండా పోయిన రవి హత్యకేసు మిస్టరీ వీడటంతో వారి కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది.