గవర్నమెంట్ జాబ్, కొబ్బరి తోటతో భర్తకు క్షణం తీరిక లేదు…భార్య వేరొకరితో….

గవర్నమెంట్ జాబ్, కొబ్బరి తోటతో భర్తకు క్షణం తీరిక లేదు…భార్య వేరొకరితో….

Man kills Friend, due to Illegal Affair with his Wife in Tamilnadu :  క్షణం తీరిక లేకుండా సంపాదనే ధ్యేయంగా బతుకుతున్న భర్త…..ఇంట్లో భార్యా పిల్లల్ని పట్టించుకోకపోయే సరికి భార్య అడ్డదారులు తొక్కింది. తన వివాహేతర సంబంధానికి భర్త అడ్డుపడుతున్నాడని ప్రియుడితో కలిసి భర్తను  హతమార్చింది ఆ ఇల్లాలు.

తమిళనాడులోని తేనీ జిల్లా వీరపాండి సమీపంలోని కొట్టూరుకు చెందిన రాజేష్ కన్నన్ (45) తమిళనాడు ఆర్టీసీలో బస్సు డ్రైవర్ గా ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాడు. అతడికి అదే ఏరియాలో కొన్ని ఎకరాల కొబ్బరితోట కూడా ఉండటంతో ఆర్ధికంగా స్ధిరపడ్డాడు. రాజేష్ కన్నన్,  మణి మంగలై(33) అనే మహిళను పెళ్ళి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు పుట్టారు.

రాజేష్ కన్నన్ ఆర్టీసీ ఉద్యోగం, కొబ్బరితోట నిర్వహణతో బిజీగా ఉంటూ ఉండేవాడు. ఈ క్రమంలో అతిని భార్య మణిమంగలైకు స్ధానికంగా ఉన్న రాజేష్ మిత్రుడు మలైస్వామితో పరిచయం ఏర్పడింది. రాజేష్ స్నేహితుడవటంతో మలైస్వామి వారింటికి వచ్చిపోతూ ఉండేవాడు.   భర్త వ్యవసాయ పనులు, ఆర్టీసీ ఉద్యోగంతో ఇంటిపద్ద తక్కువ సమయం ఉండేవాడు. దీంతో మలైస్వామితో, మణిమంగలై పరిచయం పెరిగింది. వీరిద్దరి పరిచయం క్రమేపి వివాహేతర సంబంధానికి దారి తీసింది.

భర్త ఇంటివద్ద తక్కువ సమయం ఉండటంతో వీరి బంధానికి అడ్డు ఏమీ ఉండేది కాదు. అదీకాక రాజేష్, మలైస్వామి స్వేహితులవటంతో ఈ వ్యవహారం చాలా రోజుల వరకు బయటకు తెలియలేదు. ఎవ్వరూ వారిద్దరినీ అనుమానించలేదు. వీరి సంబంధం నాలుగేళ్లుగా కొనసాగింది.

ఒకరోజు రాత్రి మణిమంగలై, మలైస్వామి ఇద్దరూ బెడ్ రూం లో సన్నిహితంగా ఉండగా రాజేష్ కన్నన్ కు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు.  దీంతో కోపోద్రిక్తుడైన రాజేష్ పధ్దతి మార్చుకోమని భార్యను హెచ్చరించాడు. అప్పటికి మాట విన్నట్టు నటించిన మణిమంగలై.. తర్వాతి కాలంలో మళ్లీ తన ప్రియుడితో ఎఫైర్ కొనసాగించ సాగింది.

ఇది గుర్తించిన రాజేష్ కన్నన్ ఒకసారి భార్యను చితకబాదాడు. ఇక భర్త తన అక్రమ సంబంధం పట్ల సీరియస్ గా ఉన్నాడని గ్రహించిన భార్య తన ప్రియుడితో కలిసి భర్తను హత మార్చటానికి ప్లాన్ వేసింది. ఇద్దరూ కొంతకాలం కలవకుండా దురంగానే ఉన్నారు. భార్య తాను చెప్పిన మాట విందని సంతోషించాడు రాజేష్ కన్నన్.

గత సోమవారం ఎప్పటిలాగానే  డ్యూటీ ముగించుకుని వచ్చిన రాజేష్,  కొబ్బరితోటకు వెళ్లాడు. అక్కడ పనివాళ్ళతో పని చేయిస్తూ ఉండేసరికి బాగా పొద్దు పోయింది. దీంతో ఇంక రాత్రికి ఇంటికి రాననితోట వద్దే ఉంటానని భార్యకు ఫోన్ చేసి చెప్పాడు. మణిమంగలై వెంటనే తన ప్రియుడు మలైస్వామికి ఫోన్ చేసి ఈవిషయం చెప్పింది. భర్త ఈరోజు రాత్రికి తోటలోనే నిద్ర పోతున్నాడని చెప్పింది.

రాత్రికి తొటకు వెళ్ళిన మలైస్వామి తన మిత్రుడుని బండరాతితో కొట్టి చంపేశాడు. ఏమీ ఎరుగనట్టు ఇంటికి తిరిగి వచ్చేశాడు. మర్నాడు ఉదయం కొబ్బరి తోటలో యజమాని శవాన్ని గుర్తించిన పనివారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసలు దర్యాప్తు మొదలెట్టారు.

దర్యాప్తులో మణిమంగలై అక్రమ సంబంధం విషయం బయటపడింది. పోలీసులు మలైస్వామిని, మణిమంగలైను అదుపులోకి తీసుకుని తమదైన స్టైల్లో విచారించారు. దీంతో మలైస్వామి నేరం ఒప్పుకున్నాడు. ఇద్దరిపై కేసు నమోదు చేసిన పోలీసులు వారిని రిమాండ్ కు తరలించారు.