ప్లస్ టూ చదివే విద్యార్ధితో ఆంటీ వివాహేతర సంబంధం : విషయం అందరికీ తెలిసే సరికి…
టీవీ సీరియల్స్ ప్రభావమో… పెరుగుతున్న టెక్నాలజీ ప్రభావమో తెలీదు కానీ సమాజంలో ప్రతి ఒక్కరిలోనూ కొత్తగా ఏదో కావాలనే తాపత్రయం. దేనికీ తృప్తి లేని జీవితాలు. అవి ఆస్తిపాస్తులు కావచ్చు. నగలు నట్రా కావచ్చూ… టీవీ సీరియల్ లో ఉండే పాత్రధారుల్లా వేషధారణ కావచ్చు, సీరియల్స్ లో కనపడే అక్రమ సంబంధాలు కావచ్చూ….అది ఏదైనా సరే … జీవితంలో కొత్తదనం కావాలి. దాని కోసం పరితపించి పోతున్నారు. ఆ క్రమంలో అడ్డదారులు తొక్కి జీవితాన్ని అర్ధాంతరంగా ముగించుకుంటున్నారు.
పెళ్లై ఇద్దరు పిల్లలు ఉండి, మొగుడికి తెలియకుండా తన వయస్సులో సగం చిన్నవాడైన ప్లస్ టూ చదివే యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకుని…. ఆ బండారం బయటపడటంతో మనస్తాపానికి గురై తనువు చాలించిందో మహిళ.
తమిళనాడులోని తంజావూరు జిల్లాలోని ఓ గ్రామంలో ఆండాళ్(31) అనే మహిళ భర్త మురుగన్, ఇద్దరు పిల్లలతో కలిసి జీవిస్తోంది. భర్త మురుగన్ స్ధానికంగా ఉన్న ఒక కంపెనీలో ఉద్యోగం చేసేవాడు. ఆమెకు తన ఇంటికి సమీపంలో ఉండే ప్లస్ టూ చదివే ఒక విద్యార్దితో పరిచయం ఏర్పడింది. భర్త పనికి, పిల్లలు స్కూల్ కు వెళ్లిపోతే … ఆండాళ్ …ప్లస్ టూ చదివే విద్యార్ధి కనుక ఇంటి వద్ద ఉంటే… అతడ్ని ఇంటికి పిలిపించుకుని అతడితో కబుర్లు చెపుతూ కాలక్షేపం చేసేది.
వీలున్నప్పుడల్లా ఆమెతో మాట్లాడటానికి ఇంటికి వచ్చే ఆ కుర్రాడిని తన కొంటె మాటలతోనూ, శృంగార చేష్టలతోనూ రెచ్చ గొట్టేది ఆండాళ్. ఈ పరిచయం కొంచెం హద్దులు దాటి కొన్నాళ్లకు వారిద్దరి మధ్య శారీరక సంబంధానికి దారి తీసింది. ఈక్రమంలో ఆండాళ్ కుర్రాడితో తన కామ కోరికలు తీర్చుకుని తృప్తి చెందేది. ఈ వ్యవహారం గుట్టుగా కొంతకాలం నుంచి నడుస్తోంది.
అయితే గత కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతుండటంతో మురుగన్, పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారు. కాలేజీలు లేక పోవటంతో ఆ విద్యార్ధి ఇంటి వద్దే ఉంటున్నాడు. ఒక రోజు ఉదయం మురుగన్ పిల్లల్ని తీసుకుని బయటకు వెళ్లిన సమయంలో ప్లస్ టూ చదివే విద్యార్ధి ఆండాళ్ ఇంటికి వచ్చాడు. ఇది ఆ విద్యార్ధి తల్లితండ్రులు గమనించి అతడ్ని ప్రశ్నించారు. తల్లి తండ్రులు గట్టిగా నిలదీయటంతో భయపడిన విద్యార్ధి ఆండాళ్ తో కొనసాగుతున్న అక్రమ సంబంధం గురించి చెప్పేశాడు.
తనను రెచ్చగొట్టి లైంగిక వాంఛలు తీర్చుకుంటోందనే విషయం చెప్పటంతో కుర్రాడి తల్లి తండ్రులు ఆవేశంతో ఊగిపోయారు. వెంటనే ఆమె ఇంటికి వెళ్లి తమ కొడుకు జీవితంతో ఎందుకు ఆడుకుంటున్నావు….. చదువు కుంటున్న విద్యార్ధి జీవితాన్నినాశనం చేస్తున్నావని ప్రశ్నించారు. అదే సమయంలో ఇంటికి వచ్చిన మురుగన్ విషయం తెలుసుకుని ఆండాళ్ ను సీరియస్ గా మందలించాడు.
ఒక వైపు విద్యార్ధి తల్లి తండ్రులు, మరోవైపు భర్త తనను మందలిచటంతో పరువు పోయిందని మనస్తాపానికి గురైంది ఆండాళ్. ఆ రోజు ముభావంగా ఉన్న ఆండాళ్…. రాత్రి అందరూ నిద్రపోయాక, తెల్లవారుఝూమున ఇల్లు వదిలి బయటకు వెళ్లిపోయింది. తెల్లారి నిద్రలేచిన మురుగున్ కి భార్య కనపడలేదు. ఆమె కొసం ఇల్లంతా వెతికాడు. అయినా తన భార్య కనపడలేదు.
ముందు రోజు జరిగిన సంఘటనతో మనసు ఏదో కీడు శంకించింది. తెలిసిన వారందరికీ ఫోన్ చేసి ఎంక్వైరీ చేశాడు భార్యా ఆచూకి కోసం. ఎక్కడా దొరకలేదు. ఇంతలో ఎవరో చెప్పారు…. ఊళ్ళోని ఒక చెట్టుకు ఆండాళ్ ఉరి వేసుకుని ఆత్మ హత్య చేసుకుందని. హుటా హుటిన ఘటనా స్థలానికి వెళ్ళిన మురుగన్ భార్య చేసిన పనికి రోదించాడు.
సమాచారం తెలుసుకుని ఘటనా స్ధలానిక వచ్చిన నడుకావేరి పోలీసు స్టేషన్ పోలీసులు మృత దేహాన్ని పోస్టు మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. ప్లస్ టూ చదివే విద్యార్ధితో జరుగుతున్న వివాహేతర సంబంధం నలుగురిలో బయటపడి… అవమానంగా భావించి ఆండాళ్ ఆత్మ హత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.