Woman Suspect Death : తనకంటే పెద్దదైన మహిళతో ప్రేమ, పెళ్లి….శవమై తేలిన భార్య….!

తన కంటే పెద్దదైన మహిళతో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నాడు. సాఫీగా సాగుతున్న సంసారంలో ఏమైందో ఏమోఒకరోజు భార్య శవమై తేలింది.

Woman Suspect Death : తనకంటే పెద్దదైన మహిళతో ప్రేమ, పెళ్లి….శవమై తేలిన భార్య….!

Married Woman Killed

Woman suspect Death : తన కంటే పెద్దదైన మహిళతో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నాడు. సాఫీగా సాగుతున్న సంసారంలో ఏమైందో ఏమోఒకరోజు భార్య శవమై తేలింది. భర్త పరారీలో ఉన్నాడు.

హైదరాబాద్ కుషాయి‌గూడ పోలీసు స్టేషన్ పరిధిలోని రాజీవ్ నగర్ హెచ్‌బీ కాలనీలో సోమవారం రాత్రి లక్ష్మీ అనే వివాహిత మహిళ అనుమానాస్పదంగా మృతి  చెందింది. ఈ ఘటనలో ఆమె భర్త పరుశురాం పరారీలో ఉండటంతో పలు అనుమానాలకు తావిస్తోంది.

Also Read : Extra Marital Affair : ఒక ప్రియురాలు, ఇద్దరు ప్రియులు……!
సిధ్దిపేట జిల్లా చేర్యాలకు చెందిన పరుశురాం అనే వ్యక్తి కొంతకాలం క్రితం హైదరాబాద్ కు వచ్చి కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి శ్రీకాకుళం జిల్లాకు చెందిన లక్ష్మీ అనే మరో మహిళా కూలీతో పరిచయం ఏర్పడింది.

లక్ష్మి పరుశురాం కంటే వయస్సులో పెద్దది. అప్పటికే వివాహమై భర్త నుంచి విడిపోయి దూరంగా ఉంటోంది. ఈక్రమంలో పరుశురాంతో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ కూలీలుగా పని చేస్తున్నారు. వీరి పరిచయం కాస్తా ప్రేమగా మారి పెళ్లి చేసుకున్నారు. ఐదు నెలలక్రితం హెచ్ బీ కాలనీ, రాజీవ్ నగర్ లో ఓ గది అద్దెకు తీసుకుని కొత్తగా సంసారం పెట్టారు.

ఇద్దరూ రోజూ కూలీకి వెళ్లి వస్తున్నారు. ఇద్దరికీ మద్యం తాగే అలవాటు ఉంది. రోజు సంపాదించిన దానిలో కొంత తాగి వచ్చేవారు. ఆ తాగిన మైకంలో ఒకరినొకరు తిట్టుకుంటూ గొడవ పడుతూ ఉఁడేవారు. మళ్లీ తెల్లారి లేచి ఇద్దరూ కలిసి కూలీకివెళ్లే వాళ్లు.  ఇది చూడటం చుట్టుపక్కల వారికి అలవాటైపోయిందని ఇంటియజమాని చెప్పుకొచ్చారు.

కాగా మంగళవారం, అక్టోబర్5న  ఉదయం లక్ష్మి తన గదిలో మరణించి ఉండటం చూసిన స్ధానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్ధలానికి వచ్చిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పరీశీలించగా మృతురాలి ముఖంపై గాయాలు ఉన్నాయి.

చెవి, ముక్కు, నోరు, కళ్లలోంచి కారుతున్న రక్తం మరకలు, మెడకు తాడు బిగించినట్లు కనిపిస్తున్న చారల గుర్తులు నమోదు చేసుకున్నారు. భర్త పరుశురాం ఆచూకీ లేదు. ఇవన్నీ చూస్తుంటే ఆమెది హత్యా.. ఆత్మహత్యా.. అనే సందేహం కలుగుతోంది. మృతదేహాన్ని చూస్తుంటే పరుశురాం భార్యను హత్యచేసి పరారై ఉంటాడని భావిస్తున్నారు.